Lokesh | విధాత: టీడీపీ యువనేత లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా వైసిపి నాయకులకు అయన గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి భయాన్ని పరిచయం చేస్తాను అని, గుడ్డలూడదీసి కొడతానని ఆయా నియోజకవర్గాల్లోని వైసిపి నాయకులను బెదిరిస్తున్నారు. తాను ఒక ఎర్ర డైరీలో అందరి పేర్లూ రాస్తున్నాని, చెబుతూ అదే క్రమంలో మొన్న పుంగనూరులో గొడవలు జరిగినప్పుడు అన్నమయ్య జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి టిడిపి నాయకులను అరెస్ట్ చేస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దీంతో […]
Lokesh |
విధాత: టీడీపీ యువనేత లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా వైసిపి నాయకులకు అయన గట్టి హెచ్చరికలు చేస్తున్నారు. ఒక్కొక్కరికి భయాన్ని పరిచయం చేస్తాను అని, గుడ్డలూడదీసి కొడతానని ఆయా నియోజకవర్గాల్లోని వైసిపి నాయకులను బెదిరిస్తున్నారు.
తాను ఒక ఎర్ర డైరీలో అందరి పేర్లూ రాస్తున్నాని, చెబుతూ అదే క్రమంలో మొన్న పుంగనూరులో గొడవలు జరిగినప్పుడు అన్నమయ్య జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి టిడిపి నాయకులను అరెస్ట్ చేస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.
దీంతో రిషాంత్ రెడ్డి పేరును సైతం డైరీలో రాసుకుంటున్నానని, తాను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరికీ భయాన్ని పరిచయం చేసే బాధ్యత తానూ తీసుకుంటాను అని చెప్పారు. ఇదిలా ఉండగా పాదయాత్రలో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కూడా లోకేష్ గట్టి విమర్శలు చేశారు.
కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరులో లోకేష్ పాదయాత్ర చేయలేదు. ఇక కొడాలి నాని సైతం చంద్రబాబును, లోకేష్ ను పూచికపుల్ల మాదిరి తీసేస్తుంటారు. లోకేష్ ను పప్పు అని ఎగతాళి చేసే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో సైతం లోకేష్ అడుగుపెట్టలేదు.
మిగతా ప్రాంతాలన్నీ ఒకెత్తు, తనను నిత్యం ఆటాడుకునే పెద్దిరెడ్డి, కొడాలి నియోజకవర్గాలను కవర్ చేయకుండా పాదయాత్ర ముగించడం ఏమిటన్నది పెద్ద సందేహం. అందరికీ భయాన్ని పరిచయం చేసే బాధ్యత తీసుకునే లోకేష్ తానే భయపడ్డరా ? కొడాలి నియోజకవర్గం అయిన గుడివాడ వెళితే ఏమవుతుందో అనే భయం వల్లనా ? మరెందుకు అయన అటు వెళ్లలేదన్న సందేహాలు పార్టీ క్యాడర్లో వ్యక్తం అవుతున్నాయి.