త్వరలో ప్రారంభం కానున్న ఆటోమేటెడ్ మెగా డెయిరీ పరిశీలించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ విధాత, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామం వద్ద కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఆటోమేటెడ్ మెగా డెయిరీని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం సందర్శించారు. సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, నాబర్డ్ జనరల్ మేనేజర్ హరగోపాల్, డిడిఎం […]
విధాత, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామం వద్ద కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఆటోమేటెడ్ మెగా డెయిరీని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం సందర్శించారు. సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు, నాబర్డ్ జనరల్ మేనేజర్ హరగోపాల్, డిడిఎం అనంత్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సీఈఓ ఎన్ సత్యనారాయణ రావులతో కలిసి డెయిరీలోని అన్ని విభాగాలను పరిశీలించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావును ఆహ్వానించాలని ఈ సందర్భంగా వినోద్ కుమార్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావుకు సూచించారు. వినోద్ కుమార్ కరీంనగర్ లోక్ సభ సభ్యుడిగా పనిచేసిన కాలంలో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖచే 63 కోట్లు మంజూరు చేయించి మెగా డైరీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని రాజేశ్వరరావు కొనియాడారు.
ఈ డెయిరీ ప్రారంభం అయితే కరీంనగర్ డెయిరీ ఐదు లక్షల లీటర్ల పాల సరఫరాకు విస్తరిస్తుందన్నారు.
కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్లు నారాయణరెడ్డి, ప్రభాకర్ రావు, సలహాదారు హనుమంత రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ టి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.