Karimnagar | తప్పుడు సాక్ష్యం చెప్పిన ఇద్దరికీ షోకాస్ నోటీస్ ఇవ్వాలని ఆదేశం కరీంనగర్ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు విధాత బ్యూరో, కరీంనగర్: అవినీతికి పాల్పడిన కేసులో సబ్ ఇన్స్పెక్టర్ కు ఐదేళ్ల కారాగార శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ కరీంనగర్ అవినీతి నిరోధక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ఇద్దరికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కోర్టు ఆదేశించింది. 2006 నాటి ఈ కేసుకు సంబంధించి అవినీతి […]
Karimnagar |
విధాత బ్యూరో, కరీంనగర్: అవినీతికి పాల్పడిన కేసులో సబ్ ఇన్స్పెక్టర్ కు ఐదేళ్ల కారాగార శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ కరీంనగర్ అవినీతి నిరోధక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ఇద్దరికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కోర్టు ఆదేశించింది.
2006 నాటి ఈ కేసుకు సంబంధించి అవినీతి నిరోధక కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. వివరాలలోకి వెళ్తే.. కామారెడ్డి పట్టణం వివేకానంద కాలనీకి చెందిన ధర్మ గౌడ్ దుబాయిలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న ఆయన పెద్ద కుమారుడు నరేష్ తమ కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమించి తన వెంట తీసుకువెళ్లాడు.
దీంతో సదరు యువతి, తల్లిదండ్రులు తమ కూతురును నరేష్ కిడ్నాప్ చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు నరేష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. భార్య ద్వారా విషయం తెలుసుకున్న ధర్మ గౌడ్ దుబాయ్ నుండి స్వస్థలానికి చేరుకున్నారు.
ఆయనను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన ఎస్సై మురళీధర్, కేసు తక్కువ చేసేందుకు గాను తనకు రూ.6 వేలు లంచంగా ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ధర్మ గౌడ్ పై కూడా కేసు నమోదు చేసి తిరిగి దుబాయ్ వెళ్లకుండా చేస్తానని బెదిరించారు. విధి లేని పరిస్థితుల్లో ధర్మ గౌడ్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ వెళ్లి లంచం డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయగా, ఎస్సై ఆర్అండ్ బీ అతిథి గృహం వద్దకు వచ్చి ఇవ్వాలని చెప్పారు. ధర్మ గౌడ్ నుండి ఎస్సై లంచం డబ్బు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.