విధాత: టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేశ్ బాబు తల్లి ఇందిరాదేవి ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇందిరాదేవి మృతితో ఘట్టమనేని ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందిరా దేవి మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం ఇందిరా పార్థివదేహాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఇందిరా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కృష్ణ, ఇందిరలకు ఐదుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రమేశ్ బాబు, మహేశ్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. పెద్ద కుమారుడు రమేశ్ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరిలో మృతి చెందాడు. కృష్ణ, విజయ నిర్మలకు సంతానం నరేశ్. కృష్ణ రెండో భార్య విజయ నిర్మల.. అనారోగ్యంతో 2019, జూన్ 27న మరణించిన సంగతి తెలిసిందే.
Latest News
సీనియర్ నేత కుట్రతో చేజారిన పీసీసీ పీఠం?.. ఒంటరైన జీవన్ రెడ్డి.. పొమ్మన లేక పొగ
విరోష్ పెళ్లి కానుకగా దేశవ్యాప్తంగా స్వీట్లు, గుళ్లలో అన్నదానం ..
రూ.10కోట్ల పంచలోహ విగ్రహం..ప్రతిష్టాపనోత్సవానికి సిద్దం
గుండెల్ని పిండేసే దృశ్యం..ఇజ్రాయెల్ దాడిలో 108మంది విద్యార్థినుల మృతి
దేవ్ జీ నేతృత్వంలో తెలంగాణ నేల మీదుగా లొంగిపోయిన మావోయిస్టు నేతలతో రాజకీయపార్టీ
యుద్ధం ఎఫెక్ట్...పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం
దుబాయ్లో మిస్సైల్స్ కలకలం..
ఈ వారం రాశిఫలాలు.. ఈ రాశి అవివాహితులకు కల్యాణ యోగం..!
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ బతికే ఉన్నారా? "మరణించివుండవచ్చని" నెతన్యాహూ సంచలన ప్రకటన