విధాత: CPS పెన్షన్ విధానం రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ ఆదేశానుసారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కాలేజీ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు పెన్షన్ కానిస్టిట్యూషనల్ మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని ప్రభుత్వ శాఖల సి.పి.ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శిరందాసు రామదాసు మాట్లాడుతూ సి.పి.ఎస్ విధానం రద్దు కోసం దశాబ్ద […]
విధాత: CPS పెన్షన్ విధానం రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ ఆదేశానుసారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కాలేజీ నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు పెన్షన్ కానిస్టిట్యూషనల్ మార్చ్ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని ప్రభుత్వ శాఖల సి.పి.ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శిరందాసు రామదాసు మాట్లాడుతూ సి.పి.ఎస్ విధానం రద్దు కోసం దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నామని, పెన్షన్ ఉద్యోగి హక్కు అని ప్రభుత్వం గుర్తించాలన్నారు.
మా పొరాటాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించించిందని, రిటైర్మెంట్ అనంతరం సర్వీస్ పెన్షన్ కోసం పోరాటం చేస్తున్నామని తెలిపారు. సి.పి.ఎస్ విధానం రద్దు అనేది ఎంప్లాయి ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి కెసిఆర్ ద్వారానే సాధ్యం అన్నారు.
ఉద్యోగుల ఆకాంక్షను గుర్తించిన పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఎస్ విధానం రద్దు చేశారని ఆ దిశగా మరో పది రాష్ట్రాలు ఆలోచిస్తున్నాయన్నారు. ఈ సమయంలో కేంద్రప్రభుత్వం సి.పి.ఎస్ నుండి వైదొలుగుతున్న రాష్ట్రాలకు భవిష్యత్తులో రుణ సౌకర్యం ఉండదని, ఇప్పటి వరకు షేర్ మార్కెట్లో పెట్టిన ఉద్యోగుల ఖాతాలోని సొమ్మును తిరిగి ఇవ్వం అంటు రకరకాల ఆంక్షలతో రాష్ట్ర ప్రభుత్వాలపై బెదిరింపు చర్యలకు పాల్పడడం సిగ్గు చేటు అన్నారు.
లక్షా డెబ్బై ఆరువేల సి.పి.ఎస్ ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం రాబోయే ఎలక్షన్స్ లోపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానం రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో ఓట్ ఫర్ ఓపిఎస్ నినాదంతో ఉద్యమ కార్యాచరణ ఉంటుంది అని తెలిపారు. సిపిఎస్ రద్దు కోసం తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపెందర్, కోశాధికారి అందుగుల విజయ్, రాష్ట్ర బాధ్యులు పంకజ్ రెడ్డి, నల్లమేకల వెంకయ్య, కొరివి కృష్ణ, శ్రీనివాస్, PRTU పూర్వ అధ్యక్షులు సుంకరి భిక్షం గౌడ్, PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం నారాయణ రెడ్డి, UTF జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాల్ల వెంకటేశం, పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రాంబాబు, STU జిల్లా అధ్యక్షులు గణపురం భీమయ్య, TUTF జిల్లా అధ్యక్షులు వంగూరి నారాయణ యాదవ్, TPRTU జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శంకర్, TMSTA రాష్ట్ర అధ్యక్షులు భూతం యాకమల్లు, BCTA జిల్లా అధ్యక్షులు సోమలింగయ్య యాదవ్, BCTU జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, PMTA TS రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీష్, DTF రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య, TPUS నాయకులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.