Medak | విధాత, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ శివారులోని ఎమ్మెన్నార్ పరిశ్రమ సమీపంలో సంగారెడ్డి నర్సాపూర్ ప్రధాన రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. హత్నూర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్నూర మండలం నవాబుపేట గ్రామానికి చెందిన అవుసలి శ్రీశైలం(39) ఎరుకలి రాములు( 40)ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై మండలంలోని బోర్పట్ల శివారు లో గల మిషన్ భగీరథ పంప్ హౌస్ […]
Medak |
విధాత, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ శివారులోని ఎమ్మెన్నార్ పరిశ్రమ సమీపంలో సంగారెడ్డి నర్సాపూర్ ప్రధాన రహదారిపై సోమవారం చోటు చేసుకుంది.
హత్నూర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్నూర మండలం నవాబుపేట గ్రామానికి చెందిన అవుసలి శ్రీశైలం(39) ఎరుకలి రాములు( 40)ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై మండలంలోని బోర్పట్ల శివారు లో గల మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్దకు పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెన్నార్ పరిశ్రమ సమీపంలోకి రాగానే హైదరాబాదు నుంచి మాదుర దత్తాచల క్షేత్రానికి దర్శనం నిమిత్తం ప్రయాణికులతో కలిసి వస్తున్నా కారు డ్రైవర్ అతివేగంగా ఆజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో శ్రీశైలం, రాములు, అక్కడికక్కడే మృతిచెందగా కార్ బెలూన్లు తెర్చుకోవడంతో కారులోని వారికి ప్రమాదం తప్పింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మృతుడు శ్రీశైలంకు భార్య రేణుక కొడుకు కూతురు రాములకు భార్య లక్ష్మీ ఇద్దరు కూతుర్లు ఉన్నారు.