MGNREGS | ఖాతాల్లోనే ‘ఉపాధి’ జమ..! తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన కేంద్రం..!
MGNREGS | ఉపాధిహామీ చెల్లింపులపై కేంద్రం మరోసారి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద వేతనాలను చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను జనవరిలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు ఈ నెల 31 వరకు డెడ్లైన్ విధించింది. ఇకపై తేదీని పొడిగించే ప్రసక్తే లేదని, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ను […]

MGNREGS |
ఉపాధిహామీ చెల్లింపులపై కేంద్రం మరోసారి కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద వేతనాలను చెల్లించేందుకు ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను జనవరిలో తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని అమలు చేసేందుకు ఈ నెల 31 వరకు డెడ్లైన్ విధించింది.
ఇకపై తేదీని పొడిగించే ప్రసక్తే లేదని, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. మొదట చెల్లింపు విధానానికి సంబంధించి మార్చి 31 వరకు గడువు నిర్ణయించింది. అయితే, డెడ్లైన్ను జూన్ 30 వరకు.. ఆ తర్వాత ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ వచ్చింది.
ఇకపై గడువును పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ను అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 90శాతం కార్మికుల ఆధార్ అనుసంధానం పూర్తయ్యిందని, ఇకపై గడువు పొడిగించబోయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
ఆధార్ అనుసంధాన ప్రక్రియలో ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడిపోయాయి. అస్సాంలో 42శాతం, అరుణాచల్ ప్రదేశ్లో 23శాతం, మేఘాలయలో 70శాతం, నాగాలాండ్లో 37శాతం మంది ఆధార్ సీడింగ్ పూర్తి కావాల్సి ఉందని తెలిపారు. వందశాతం ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ను తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తుండగా.. లబ్ధిదారులను ఏబీపీఎస్ కిందకు మారేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది.