Jagadish Reddy | వృత్తి దారులకు పెద్దపీట ఇది సీఎం కేసీఆర్ ఘనతే.. పేటను మరింత అభివృద్ధి పథంలో నడుపుదాం మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి విధాత, సూర్యాపేట: గత తొమ్మిదేండ్లుగా అన్ని రంగాల అభివృద్ధితో పాటు వృత్తి దారులకు పెద్దపీట వేసి అండగా నిలుస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ సూర్యాపేటను మరింత అభివృద్ధి పధంలో […]
Jagadish Reddy |
విధాత, సూర్యాపేట: గత తొమ్మిదేండ్లుగా అన్ని రంగాల అభివృద్ధితో పాటు వృత్తి దారులకు పెద్దపీట వేసి అండగా నిలుస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ సూర్యాపేటను మరింత అభివృద్ధి పధంలో నడుపుకుందామని పిలుపునిచ్చారు.
ఆదివారం సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మోడ్రన్ మార్కెట్లో నిర్వహించిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట పట్టణాన్ని ఇంకా రెండింతల అభివృద్ధి చేస్తానని, ప్రజలు నా నుండి ఏమి కోరుకొని నన్ను ఎన్నుకున్నారో నాకు తెలుసన్నారు.
గతంలో శాంతిభద్రతలు ఎలా ఉండేవో ప్రజలకు తెలుసని, ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు ప్రశాంతంగా చేసుకుంటూ సంతోషంగా బ్రతుకుతున్నారన్నారు. జూకి మిషన్ల వల్ల టైలర్లకు శారీరక శ్రమ తగ్గుతుందని, అందుకే వీటిని అందజేశామన్నారు. సూర్యాపేట పట్టణంలో 215 మందికి కుట్టు మిషన్లు అందజేస్తున్నామని, సుమారు రూ.50 లక్షలు ఇందుకు వ్యయం చేశామన్నారు.
ఇంతకుముందు 135 మందికి, ఇప్పుడు 215 మందికి మొత్తం 350 మందికి కుట్టు మిషన్లు అందజేశామన్నారు. టైలర్స్ వృత్తిదారుల సంఘం భవనానికి స్థల కేటాయింపు చేయాలని అధ్యక్షులు నగేష్ కోరిక మేరకు త్వరలో స్థలాన్ని పరిశీలించి అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి జగదీశ్ రెడ్డి చేతులు మీదుగా జూకి మిషన్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆర్డీవో వీర బ్రహ్మచారి, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, బీసీ సంక్షేమ అధికారి అనసూయ, వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.