BRS విధాత, మెదక్ బ్యూరో: విభేదాలు,మనస్పర్థలు పక్కన పెట్టి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించిన మాణిక్ రావును గెలిపించాలని ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు జహీరాబాద్ నియోజక వర్గానికి ఉంది. జహీరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇవ్వాలన్నారు. మూడవ సారి బీఆర్ఎస్ టికెట్ పొందిన మాణిక్ రావుని […]
BRS
విధాత, మెదక్ బ్యూరో: విభేదాలు,మనస్పర్థలు పక్కన పెట్టి సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించిన మాణిక్ రావును గెలిపించాలని ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మంత్రి హరీష్ రావు అన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు జహీరాబాద్ నియోజక వర్గానికి ఉంది. జహీరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇవ్వాలన్నారు. మూడవ సారి బీఆర్ఎస్ టికెట్ పొందిన మాణిక్ రావుని గతంలో లాగా భారీ మెజారిటీతో గెలిపించు కోవాలన్నారు.
పార్టీ నిర్ణయించిన అభ్యర్థి మాణిక్ రావు గారి గెలుపుకు కృషి చేయాలి. పార్టీ నిర్ణయం, సీఎం కేసీఆర్ గారి నిర్ణయంలో మార్పు ఉండదు. విజయం సాధించి జహీరాబాద్ అభివృద్ధిని కొనసాగించాలనీ మంత్రి హరీష్ పిలుపునిచ్చారు. కేసీఆర్ హ్యాట్రిక్ విజయాల్లో జహీరాబాద్ భాగస్వామి అవ్వాలని అక్కంక్షించారు.
మనస్పర్థలు పక్కన పెట్టి పార్టీ కోసం కష్టపడి పని చేయండనీ బిఆర్ఎస్ ముఖ్య నాయకులకు సూచించారు. ఈ క్రమంలో పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు అవకాశం తప్పకుండా వస్తుందని బరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో భవిషత్తు ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు తగిన అవకాశాలు వస్తాయి. ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుతుంది, కలసికట్టుగా పనిచేద్దాం 3 వసారి బిఆర్ఎస్ పార్టీనీ అధికారంలోకి తెద్దాం. ముచ్చటగా మూడో సారి సీఎం కెసిఆర్ ను సీఎం ను చేద్దామన్నారు.
ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులు, ప్రధాన కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఇచ్చి గౌరవించింది. ఇంకా ఇతర కార్యకర్తలకు పార్టీ అవకాశం ఇస్తుంది. మనస్పర్థలు పక్కన పెట్టి పని చేస్తే గెలుపు మనదే. జహీరాబాద్ విజయం మనందరి లక్ష్యం కావాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే,మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్,జిల్లా నాయకులు, నరోత్తం,టి యస్ idc చైర్మన్ తన్వీర్,అన్ని మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.