Gruha Lakshmi
విధాత: గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణశాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు.
గడువు అయిపోయిందని కావున ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదన్నారు. దరఖాస్తు రులు తమతమ ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కు ధరఖాస్తులు పంపించవచ్చునని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.
దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తామన్నారు. ప్రతి పక్షాలు, కొన్ని పత్రికలు చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నామన్నారు.
సీఎం కేసిఆర్ ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేని వారికి ఇల్లు కట్టు కోవడానికి రూ. 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసే విషయంలో దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవని, ఇంటి నంబర్ ఉన్నా, లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.