Medak | ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలి మెదక్ జిల్లాపై హరీష్ రావు పెత్తనం ఎమిటి మెదక్ పై మంత్రి వివక్ష నిలదీసిన ఏబీవీపి నాయకులు 3,500 కోట్ల ఫీజ్ రియింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ గంట పాటు కలెక్టరేట్ ఎదుట ధర్నా విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాపై మంత్రి హరీష్ రావు పెత్తనం ఎమిటనీ మెదక్ మహిళా డిగ్రీ కళాశాల ను సిద్దిపేటకు తరలించుకు పోతున్నారని వెంటనే మెదక్లోనే కళాశాలను పునః […]
Medak |
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాపై మంత్రి హరీష్ రావు పెత్తనం ఎమిటనీ మెదక్ మహిళా డిగ్రీ కళాశాల ను సిద్దిపేటకు తరలించుకు పోతున్నారని వెంటనే మెదక్లోనే కళాశాలను పునః ప్రారంభించాలని ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు కలెక్టరేట్ కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. మెదక్ జిల్లా నుంచి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మెదక్లో కొనసాగిన మహిళా డిగ్రీ కళాశాలను మంత్రి హరీష్ రావు అండదండలతో సిద్దిపేటకు తరలించుకుపోతున్నారని ఏబీవీపీ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ శశాంక్ లు ఆరోపించారు.
ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాలను, మెదక్లో ఉన్నా మహిళా డిగ్రీ కళాశాలను మంత్రి సిద్దిపేటకు తరకించుకు పోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్లు విద్యార్థిని విద్యార్థులకు రావలసిన ఫీజ్ రీయంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
సీఎం కెసిఆర్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వానికి, మంత్రికి, స్తానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా విద్యార్థిని, విద్యార్థులు నినాదాలు చేశారు. దాదాపు గంటపాటు జరిగిన ధర్నాలో వందలాది మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
స్థానిక డిఎస్పీ సైదులు అధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. కేవలం 5 గురు విద్యార్థు లతో కూడిన బృందాన్ని కలెక్టరేట్ లోనికి పంపించి..ప్రభుత్వ అధికారులకు వినతిపత్రం అందించేందుకు పోలీసులు ఎర్పాటు చేశారు. దీంతో కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ కు ఏబీవీపి నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.