Site icon vidhaatha

Nalgonda | కానిస్టేబుల్ తుది పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: SP అపూర్వ రావు

విధాత: పోలీస్ నియామక మండలి సూచనల ప్రకారం రేపు నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుల్ తుది పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్దకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. రాత పరీక్ష కోసం నల్లగొండ(Nalgonda) పట్టణ కేంద్రంలో 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 11,239 మంది అభ్యర్థులు పరీక్షకు అర్హత సాధించారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగుతుందని, పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్ అన్ని మూసి వేయాలని, పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దని తెలిపారు. పరీక్ష నిర్వహణకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష రాసే అభ్యర్థులకు సూచనలు

Exit mobile version