NOIDA | ఎక్కాలు రాలేదని టీచర్‌ దారుణం.. తోటి పిల్లలతో చితకబాదించిన వైనం

NOIDA | సంచలనం రేపిన వీడియో క్లిప్‌ బాధితుడు ముస్లిం బాలుడు నొయిడా: మంచి చెడ్డలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు దారుణానికి పాల్పడింది. ఎక్కాలు రాలేదన్న నెపంతో ఒక బాలుడిని తోటి పిల్లలతో చితకబాదించింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ మన్సూర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌కావడంతో ఈ దారుణం బయటపడింది. బాధిత బాలుడు ఒక ముస్లిం. తన క్లాసులో ముస్లింలెవరూ ఉండొద్దని ఆ టీచర్‌ హుకుం జారీ చేయడం […]

  • Publish Date - August 27, 2023 / 05:50 AM IST

NOIDA |

  • సంచలనం రేపిన వీడియో క్లిప్‌
  • బాధితుడు ముస్లిం బాలుడు

నొయిడా: మంచి చెడ్డలు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు దారుణానికి పాల్పడింది. ఎక్కాలు రాలేదన్న నెపంతో ఒక బాలుడిని తోటి పిల్లలతో చితకబాదించింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ మన్సూర్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌కావడంతో ఈ దారుణం బయటపడింది. బాధిత బాలుడు ఒక ముస్లిం. తన క్లాసులో ముస్లింలెవరూ ఉండొద్దని ఆ టీచర్‌ హుకుం జారీ చేయడం వీడియోలో వినిపిస్తున్నది.

నేహా పబ్లిక్‌ స్కూల్‌ అనే ఈ పాఠశాల టీచర్‌ త్రిప్త త్యాగి.. తన క్లాసులో ఒక ముస్లిం విద్యార్థి లెక్కల్లో తప్పు చేశాడని కోపగించుకున్నారు. అతడిని తోటి క్లాస్‌ పిల్లలతో ఒకరి తర్వాత ఒకరిని ఉసిగొల్పి కొట్టించింది. కొందరు విద్యార్థులు సానుభూతితో మెల్లగా కొడుతుంటే.. వారిని గద్దించి, గట్టిగా కొట్టాలని ఆదేశించింది. దెబ్బలతో ముఖమంతా కందిపోయి.. తట్టుకోలేక ఏడుస్తున్నా.. ఆ టీచర్‌కు కనికరం కలుగలేదు.

పైగా మరింత రెచ్చిపోయి.. ముఖం మీద కాకపోతే నడుం మీద కొట్టాలని ఆదేశించింది. ఇది వైరల్‌ కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేయించి.. దోషులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ ఘటనకు స్కూలు యాజమాన్యానిదే బాధ్యతని ముజఫర్‌పూర్‌ విద్యాధికారి శుభం శుక్లా అన్నారు. ఇంత జరిగినా, కేసు నమోదైనా ఆ టీచర్‌ మాత్రం తన చర్యను సమర్థించుకోవడం విశేషం. తాను దివ్యాంగురాలినని, అందుకే పిల్లలతో కొట్టించానని చెప్పారు. దీనికి మతం రంగు పులమొద్దని అన్నారు.

Latest News