తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్ ఫోన్ కావాలా..? ఒప్పొ A79 5G ఫోన్ వచ్చేసింది..!

బెస్ట్ ఫీచర్లతో తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్ ఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఒప్పొ కంపెనీ కొత్త ఫీచర్ ఫోన్ను తీసుకువచ్చింది. ఒప్పొ A79 మోడల్ 5జీ ఫోన్ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ ధర రూ.20వేల లోపు ఉండగా.. అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ప్రీమియం స్మార్ట్ మొబైల్ను మార్కెట్లోకి తీసుకువస్తున్నది.
ఒప్పొ A79 ఫీచర్స్ ఇవే..
ఒప్పొ A79 5జీ ఫోన్ గ్లోయింగ్ గ్రీన్, మిస్టరీ బ్లాక్ కలర్లు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ కేవలం 193 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. స్లీక్ డిజైన్తో వస్తున్నది. 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్తో 6.72 ఇంచెస్ ఎఫ్హెచ్డీ డిస్ప్లేను ఇందులో అమరచ్చారు. మొబైల్లో 50MP AI కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాతో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఏర్పాటు చేశారు. మీడియాటెక్ 6020 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉండగా.. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వస్తుంది. టీబీ వరకు స్టోరేజ్ను పెంచుకునే వీలున్నది. 33W ఛార్జర్తో 5000mAh బ్యాటరీ ఏర్పాటు చేశారు.
ధర ఎంత ఉందంటే..
A79 స్మార్ట్ మొబైల్ ఫోన్ ధరను ఒప్పొ కంపెనీ రూ.19,999గా నిర్ణయించింది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఒప్పొ స్టోర్స్లో అందుబాటులో నేటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. బ్యాంక్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఫెసిలిటీ సైతం ఉన్నది. పండుగ సీజన్ సందర్భంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏయూ బ్యాంక్ తదితర బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులపై రూ.4వేల వరకు క్యాష్ బ్యాక్ లభించనున్నది.