Pakistan విధాత: శవాలపై లైంగికదాడులు ఏంటని అనుకుంటున్నారా..? మీరు చదువుతున్నది నిజమే. శవాలపై లైంగిక దాడులను అరికట్టేందుకు సమాధులపై ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పాకిస్తాన్లో వెలుగు చూశాయి. చనిపోయిన ఆడబిడ్డలను పూడ్చిపెట్టిన తర్వాత.. వారి సమాధులపై ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇనుప కంచెలకు తాళాలు వేస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే తమ బిడ్డలను టచ్ చేసే ఛాన్స్ లేకుండా ఉండేందుకు తల్లిదండ్రులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పాకిస్తాన్లో ఇటీవలి కాలంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. […]
Pakistan
విధాత: శవాలపై లైంగికదాడులు ఏంటని అనుకుంటున్నారా..? మీరు చదువుతున్నది నిజమే. శవాలపై లైంగిక దాడులను అరికట్టేందుకు సమాధులపై ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పాకిస్తాన్లో వెలుగు చూశాయి.
చనిపోయిన ఆడబిడ్డలను పూడ్చిపెట్టిన తర్వాత.. వారి సమాధులపై ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఇనుప కంచెలకు తాళాలు వేస్తున్నారు తల్లిదండ్రులు. ఎందుకంటే తమ బిడ్డలను టచ్ చేసే ఛాన్స్ లేకుండా ఉండేందుకు తల్లిదండ్రులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
పాకిస్తాన్లో ఇటీవలి కాలంలో అత్యాచారాలు పెరిగిపోయాయి. ప్రతి 2 గంటలకు ఒక మహిళపై లైంగికదాడి జరుగుతోంది. అంతేకాకుండా మహిళల శవాలతో శారీరక సంబంధాలు పెట్టుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. ఇలా శవాలతో ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటెన్ చేయడాన్ని నెక్రోఫిలియా అంటారు.
నెక్రోఫిలియాతో బాధపడేవారికి మహిళల శవాలు నచ్చుతాయి. దీంతో సమాధులను తవ్వి, శవాలను అపహరించి, లైంగికదాడులకు పాల్పడుతారు. ఇప్పుడు ఈ నెక్రోఫిలియానే పాకిస్తాన్ను కుదిపేస్తోంది. చాలా స్మశాన వాటికల్లో మహిళలు, యువతుల శవాలు మాయవుతున్నట్లు తేలింది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి.
దీంతో కుటుంబ విలువలకు అత్యంత విలువ ఇచ్చే పాకిస్తాన్లో ఇలాంటి ఘటనలు బయటపడడంతో.. స్థానికులు అప్రమత్తమయ్యారు. మహిళలకే కాదు.. శవాలకు కూడా ఏం తప్పు జరిగినా.. ఆ దేవుడు తమను క్షమించడని, ఆ శాపం వెంటాడుతుందని పాకిస్తానీయులు నమ్ముతారు.
దీంతో మహిళలు, యువతుల సమాధులకు అత్యంత పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. శవాన్ని బయటకు తీయకుండా సమాధి చుట్టూ ఇనుప కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కంచెలకు ఇనుప తాళాలు వేసి.. తమ బిడ్డలను లైంగికదాడుల నుంచి కాపాడుకుంటున్నారు.
అయితే పాకిస్తాన్లో నెక్రోఫిలియాను ఆపే పరిస్థితి కనిపించట్లేదు. ఎక్కడ ఏ యువతి సమాధి మాయవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో శవాలను కాపాడుకునే పనిలో పడ్డారు పాకిస్తాన్ పేరెంట్స్.
పాకిస్థాన్లో 2011లో ఓ భయంకరమైన నెక్రోఫిలియా కేసు బయటపడింది. కరాచిలోని నార్త్ నాజిమాబాద్గకి చెందిన మహ్మద్ రిజ్వాన్.. స్మశానవాటిక కాపరిగా ఉంటూ… 48 మహిళా శవాలను రేప్ చేసినట్లు తేలడంతో అతన్ని అరెస్టు చేశారు.