Viral Video | ప‌ట్టాలపై ఇద్ద‌రు ముస‌లోళ్లు.. వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు

Viral Video | నెత్తిన సంచుల‌ను పెట్టుకున్న ఓ ఇద్ద‌రు ముస‌లోళ్లు.. రైలు ప‌ట్టాల‌ను దాటుతూ ప్లాట్ ఫాం ఎక్కేందుకు య‌త్నించారు. అంత‌లోనే ఓ గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. అక్క‌డే విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఆ ఇద్ద‌రిని ప్లాట్ ఫాంపైకి లాగేశారు. ఆ ఇద్ద‌రు ముస‌లోళ్లు ప్లాట్ ఫాం ఎక్కేందుకు ఇబ్బంది ప‌డ్డారు. ఒక రైల్వే పోలీసులు వారిని పైకి లాగ‌క‌పోతే ప్ర‌మాదం జ‌రిగేది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని హోషంగ‌బాద్ రైల్వే స్టేష‌న్‌లో […]

  • Publish Date - December 23, 2022 / 05:14 AM IST

Viral Video | నెత్తిన సంచుల‌ను పెట్టుకున్న ఓ ఇద్ద‌రు ముస‌లోళ్లు.. రైలు ప‌ట్టాల‌ను దాటుతూ ప్లాట్ ఫాం ఎక్కేందుకు య‌త్నించారు. అంత‌లోనే ఓ గూడ్స్ రైలు వేగంగా దూసుకొచ్చింది. అక్క‌డే విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఆ ఇద్ద‌రిని ప్లాట్ ఫాంపైకి లాగేశారు. ఆ ఇద్ద‌రు ముస‌లోళ్లు ప్లాట్ ఫాం ఎక్కేందుకు ఇబ్బంది ప‌డ్డారు. ఒక రైల్వే పోలీసులు వారిని పైకి లాగ‌క‌పోతే ప్ర‌మాదం జ‌రిగేది. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని హోషంగ‌బాద్ రైల్వే స్టేష‌న్‌లో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డుగా, ఆ వీడియోల‌ను రైల్వే అధికారులు విడుద‌ల చేశారు.

ఇద్దరు ముస‌లోళ్ల‌ను కాపాడిన రైల్వే పోలీసుల‌పై అధికారులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే ప్ర‌యాణికులు ఎవ‌రూ కూడా రైలు ప‌ట్టాలు దాటొద్ద‌ని, స్టేష‌న్‌లో ఉండే ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిల‌ను ఉప‌యోగించుకోవాల‌ని రైల్వే అధికారులు సూచించారు.