BJP విధాత: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల బిజేపీ సారధులను మార్చిన బిజేపి అధిష్టానం రేపోమాపో మరో ఆరు రాష్ట్రాల పార్టీ సారధులను కూడా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరగా.. ఇక కొత్త అధ్యక్షుల ప్రకటన పై పార్టీ జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా నుండి ఉత్వర్వులు వెలువడాల్సివుంది. సమీపిస్తున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయనున్న క్రమంలో […]
BJP
విధాత: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల బిజేపీ సారధులను మార్చిన బిజేపి అధిష్టానం రేపోమాపో మరో ఆరు రాష్ట్రాల పార్టీ సారధులను కూడా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరగా.. ఇక కొత్త అధ్యక్షుల ప్రకటన పై పార్టీ జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా నుండి ఉత్వర్వులు వెలువడాల్సివుంది.
సమీపిస్తున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేయనున్న క్రమంలో రాజకీయ, సామాజిక సమీకరణలను విశ్లేషించి కొత్త అధ్యక్షులను ఖారారు చేయనున్నారు. ఎన్నికల్లో పార్టీకి గెలుపు గుర్రాలుగా భావించే వారినే రాష్ట్ర అధ్యక్ష పదవులు వరించే అవకాశముంది.
ఇప్పటికే తెలంగాణ కొత్త అధ్యక్షుడిగా జి. కిషన్ రెడ్డి నీ, ఆంధ్రప్రదేశ్ కు దగ్గుబాటి పురంధేశ్వరి నీ, జార్ఖండ్ కు బాబులాల్ మారండి నీ, పంజాబ్ కు సునీల్ కుమార్ జక్కర్ ను, రాజస్థాన్ కు గజేంద్ర సింగ్ షేకావత్ లనూ నియమించి భారీ మార్పులు చేసింది.
ఇదే క్రమంలో కర్నాటకకు శోభా కరంద్రాంజ్, అశ్విత్ కుమార్ నారాయణ్, మధ్యప్రదేశ్ కు తోమర్, ప్రహ్లాద్ పటేల్, గుజరాత్ కు మన్సుక్ మాండవీయ, పురుషోత్తం రూపాల, జమ్ము కాశ్మీర్ కు డాక్టర్ జితేందర్ సింగ్, ఎంపీ జుగల్ కిషోర్, కేరళాకు వి.మురళీధరన్, సురేష్ గోపి, హర్యానాకు కృష్ణా పాల్ గుజ్జర్, రామవిలాస్ శర్మల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
ముందుగా తెలంగాణ, ఛత్తీస్ ఘడ్, మిజోరాం, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ గడువు జనవరిలో ముగిసిపోనున్నాయి. తదుపరి కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న జమ్మూ కాశ్మీర్ కు కూడా అక్టోబర్ పిదప ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా ల అసెంబ్లీ ల గడువు వచ్చే జూన్ వరకూ ఉండగా, పార్లమెంట్ గడువు ఏప్రిల్ -మే వరకు ఉంది. ఈ నేపథ్యంలో బీజేపి విజయ సాధనకు ఆయా రాష్ట్రాలలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర సారధుల మార్పులు చేపట్టింది.