Kothakota Dayakar Reddy | తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి.. హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
దయాకర్ రెడ్డి మూడు సార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దయాకర్ రెడ్డి.. అమరచింత నుంచి రెండుసార్లు, మక్తల్ నుంచి ఒకసారి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గానూ దయాకర్ రెడ్డి పని చేశారు. దయాకర్ రెడ్డి స్వస్థలం చిన్నచింతకుంట మండలం పర్కపురం.
దయాకర్ రెడ్డి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇతర పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దయాకర్ రెడ్డి మృతి టీడీపీకి తీరని లోటు అని ఆ పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.