విధాత: మరో ఏడుగురు ఐపీఎస్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్లకు పోస్టింగులు ఇచ్చింది.
సీఐడీ ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు, సైబరాబాద్ పరిపాలనా డీసీపీగా యోగేష్ గౌతమ్, పీసీఎస్ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ డీసీపీగా రాఘవేంద్ర రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణ కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీష్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.