TTD | తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా, శ్రీవారి సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెలలో విడుదలలో విడుదల చేయనున్నది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా లక్కిడిప్ టికెట్ల కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. టికెట్లు పొందిన భక్తులంతా 22వ తేదీ మధ్యాహ్నం వరకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. లక్కిడిప్లో సుప్రభాత సేవ, అర్చన, తోమాలసేవ, అష్టదళ పాదపద్మారాధన తదితర సేవల్లో పాల్గొనేందుకు అవకాశం దక్కుతుంది.
21న ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనున్నది. జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు 21న ఉదయం 10 గంటలకు భక్తులకు టికెట్ల అందుబాటులో ఉంచనున్నది. 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదలవనున్నది. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటాను విడుదలవుతుంది.
23న మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేయనున్నది. 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచున్నట్లు టీటీడీ వివరించింది.