అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు
మెరిసిన తెలుగు తేజాలు
పాలమూరు బిడ్డ అనన్యరెడ్డికి మూడో ర్యాంకు
విధాత : అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్స్-2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. 50మందికి పైగా సివిల్ సర్విసెస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫలితాల్లో మహబూబ్నగర్కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు.
ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకు సాధించగా, అనిమేష్ ప్రధాన్ (2), దోనూరు అనన్య రెడ్డి(3), పీకే సిద్ధార్థ్ రామ్కుమార్ (4), రుహాని (5), సృష్టి దబాస్ (6), అన్మోల్ రాథోర్ (7), ఆశీష్ కుమార్ (8), నౌషీన్ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకులతో మెరిశారు. గతేడాది విడుదలైన సివిల్స్ 2022 ఫలితాల్లో తెలుగు అమ్మాయి ఉమాహారతి మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. ఈసారి కూడా తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించడం విశేషం,
సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
దోనూరు అనన్య రెడ్డి (3) మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. నందల సాయికిరణ్ 27, మేరుగు కౌశిక్ 82, పెంకీసు ధీరజ్ రెడ్డి 173, జి. అక్షయ్ దీపక్ 196, గణేశ్ భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి 382, బన్న వెంకటేశ్ 467, కడుమూరి హరిప్రసాద్ రాజు 475, పూల ధనుష్ 480, కె. శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్ 580, పోతుపురెడ్డి భార్గవ్ 590, కె. అర్పిత 639, ఐశ్వర్య నెల్లిశ్యామల 649, సాక్షి కుమారి 679, చౌహాన్ రాజ్కుమార్ 703, గాదె శ్వేత 711, వి.ధనుంజయ్ కుమార్ 810. లక్ష్మీ బానోతు 828, ఆదా సందీప్ కుమార్ 830, జె రాహుల్ 873, హనిత వేముల పాటి 887, కె. శశికాంత్ 891, కెసారపు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోపద నవ్యశ్రీ 995 ర్యాంకులతో సత్తా చాటారు.
1016 మంది ఎంపిక
తుది ఫలితాల ద్వారా మొత్తం 1,016 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో జనరల్ – 347, ఈడబ్ల్యూఎస్ – 115, ఓబీసీ – 303, ఎస్సీ – 165, ఎస్టీ – 86 మంది అభ్యర్థులు ఉన్నారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను యూపీఎస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్లో ప్రకటించిన ప్రకారం మొత్తం 1143 ఖాళీలకు గాను 1,016 మంది ఉద్యోగాలకు అర్హత సాధించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్ పరీక్ష ఫలితాలు డిసెంబరు 8న యూపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల్లో మొత్తం 2,844 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. మెయిన్ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్)కు షార్ట్ లిస్ట్ చేశారు. వీరికి ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూ నిర్వహించారు.
గత మే నెలలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది హాజరుకాగా.. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడతలో జనవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఇంటర్వ్యూ(పర్సనాలిటీ టెస్ట్)లు నిర్వహించారు. మొదటి విడత ఇంటర్వ్యూకు మొత్తం 1026 మంది ఎంపికయ్యారు.
ఇక రెండో విడత ఇంటర్వ్యూ షెడ్యూలును జనవరి 25న విడుదల చేయగా..1003 మంది ఎంపికయ్యారు. వీరికి ఫిబ్రవరి 19 నుంచి మార్చి 15 వరకు పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇక చివరి విడతలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 9 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం 817 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించింది. మొత్తం మూడు విడతలు కలిపి 2846 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించగా మొత్తం 1016 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.