విధాత: రుణాలు తీసుకోవాలనుకునే వారికి చేదువార్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో.. ఇతర దేశాలను అనుసరించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్లోనూ వడ్డీ రేట్లను పెంచింది. 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించారు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్. దీంతో మొత్తం వడ్డీ రేటు 5.9 శాతానికి పెరిగింది. ద్రవ్యోల్బణం భయాలతో వడ్డీ రేట్లను పెంచడం ఆర్బీఐకి అనివార్యంగా […]
విధాత: రుణాలు తీసుకోవాలనుకునే వారికి చేదువార్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో.. ఇతర దేశాలను అనుసరించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత్లోనూ వడ్డీ రేట్లను పెంచింది. 50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటించారు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్. దీంతో మొత్తం వడ్డీ రేటు 5.9 శాతానికి పెరిగింది.
ద్రవ్యోల్బణం భయాలతో వడ్డీ రేట్లను పెంచడం ఆర్బీఐకి అనివార్యంగా మారింది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ శుక్రవారం తన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధిపై శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు పెరగడం ఇది మూడోసారి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు కళ్లెం వేయడం కోసం ఈ రేటును కోవిడ్-19 మహమ్మారి రావడానికి ముందు ఉన్న స్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.
అంతకుముందు ఈ ఏడాది మేలో ఒకసారి 40 బేసిస్ పాయింట్లు, తర్వాత జూన్- ఆగస్టులో మరో 50 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 140 పాయింట్లు పెంచుకుంటూ పోయింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఇప్పుడు మళ్లీ పెంపుతో అది 5.9 శాతంగా అయింది. దీంతో.. బ్యాంకు రుణాలు మరింత భారం కానున్నాయి.
లోన్లపై చెల్లించే ఈఎంఐలతో సామాన్యులకు మోతెక్కనుంది. బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచితే ఎడ్యుకేషన్, బిజినెస్, పర్సనల్, వెహికిల్ లోన్లు కూడా భారీగా పెరుగుతాయి. అప్పుడు ప్రజలు తమ అవసరాలను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ తగ్గడానికి దారి తీస్తుంది. మళ్లీ అది జీడీపీపై ప్రభావం చూపే అవకాశముంది.
మరోవైపు.. ఆర్థిక మందగమనం ఎఫెక్ట్తో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. వరుసగా 7 సెషన్లు నష్టపోయాయి. డాలర్ బలపడుతుండటం వల్ల మన ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు తరలిపోయి.. రూపాయి పతనమవుతోంది. అయితే.. రూపాయి విలువను కాపాడటానికి, స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి.. ఆర్బీఐ నిర్ణయం ఏమైనా దోహదం చేస్తుందో చూడాలి.