అంత దమ్ము, ధైర్యం, తెగువ ఉన్నాయా! చక్కర్లు కొడుతున్న వార్తలు ఉన్నమాట: సినీనటుడు నాగార్జున లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తారని సోషల్ మీడియాలో పోష్టింగులు చక్కర్లు కొడుతున్నాయి. కానీ దీని మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి నాగార్జున మంచి బిజినెస్ మ్యాన్, వివిధ కంపెనీల్లో షేర్లు, వందలాది ఎకరాల భూములు, స్టూడియోలు ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఆర్జించారు. ఈయన నష్టభయం లేని సేఫ్ సెక్టార్స్ […]
ఉన్నమాట: సినీనటుడు నాగార్జున లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తారని సోషల్ మీడియాలో పోష్టింగులు చక్కర్లు కొడుతున్నాయి. కానీ దీని మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి నాగార్జున మంచి బిజినెస్ మ్యాన్, వివిధ కంపెనీల్లో షేర్లు, వందలాది ఎకరాల భూములు, స్టూడియోలు ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టి భారీగా లాభాలు ఆర్జించారు.
ఈయన నష్టభయం లేని సేఫ్ సెక్టార్స్ లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం.. లాభాలు రాగానే అమ్ముకుని దానిలోంచి బయట పడడం.. ఇదీ ఆయన స్టయిల్.. చిన్న పెట్టుబడితో మొదలు పెట్టిన మాటివినీ భారీ మొత్తానికి స్టార్ గ్రూపుకు విక్రయించారు. ఇలా ప్రతిచోటా సేఫ్ ప్రాఫిట్స్ ఆశించే వ్యాపారి నాగార్జున భారీ రిస్క్తో కూడిన రాజకీయాల్లోకి వస్తారా..వచ్చినా నేరుగా ఎన్నికల్లో నిలబడి పోటీ చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నాగార్జునకు గతం నుంచి వైఎస్సార్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సంక్షేమ పథకాలు నచ్చి వాటికి నాగార్జున ఉచితంగా ప్రచారం కూడా చేసి పెట్టాడు. ఆ తర్వాత వైఎస్సార్ మరణించాక ఆ అనుబంధాన్ని వైఎస్ జగన్తోనూ కొనసాగిస్తూ వచ్చారు.
కాగా విజయవాడ పార్లమెంటరీ స్థానంలో వైఎస్సార్సీపీ ఇంతవరకు గెలుపొందలేదు. 2014, 2019ల్లో రెండుసార్లు వైఎస్సార్సీపీ ఇక్కడ ఓడిపోయింది. ఈ రెండు సార్లు టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ఎంపీగా గెలుపొందారు. వైఎస్సార్సీపీకి ఇక్కడ గట్టి అభ్యర్థి లభించక పోవడమే ఓటమికి కారణమంటున్నారు. 2014లో కోనేరు రాజేంద్రప్రసాద్, 2019లో ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ వైఎస్సార్సీపీ తరఫున ఓడిపోయారు.
ఈ క్రమంలో రెండు సార్లు ఓటమిని చవిచూసిన విజయవాడ నుంచి 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని జగన్ పట్టుదలగా ఉన్నారని, ఈ నేపథ్యంలో సినీ నటుడు నాగార్జున వైపు దృష్టి సారించారని అంటున్నారు. మరి ఈ తరుణంలో నాగ్ రాజకీయాల్లోకి వస్తారా..పోటీ చేస్తారా అన్నదాని మీద ఇంకా స్పష్టత లేదు.. ఇటు పార్టీ నుంచి కానీ. అటు నాగార్జున నుంచి కానీ ఓ ప్రకటన వస్తే తప్ప ఈ సోషల్ మీడియా వార్తలను విశ్వసించలేం.