Life style : చాలామందికి ఉదయం లేచిన వెంటనే నోరు ఎండిపోయినట్టుగా ఉంటుంది. గొంతు తడారిపోయి నీళ్లు తాగినాకొద్దీ మళ్లీ నోరు ఎండుకపోతూ మళ్లీ తాగాలనిపిస్తుంది. దీనికి కారణం ఏమై ఉండవచ్చనే సందేహం చాలామందిలో కలుగుతుంది. ఆరోగ్య పరిభాషలో ఇలా నోరు ఎండిపోవడాన్ని 'జిరోస్టోమియా' (Xerostomia) అంటారు. ఇది అనారోగ్య సమస్యలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు
Life style : చాలామందికి ఉదయం లేచిన వెంటనే నోరు ఎండిపోయినట్టుగా ఉంటుంది. గొంతు తడారిపోయి నీళ్లు తాగినాకొద్దీ మళ్లీ నోరు ఎండుకపోతూ మళ్లీ తాగాలనిపిస్తుంది. దీనికి కారణం ఏమై ఉండవచ్చనే సందేహం చాలామందిలో కలుగుతుంది. ఆరోగ్య పరిభాషలో ఇలా నోరు ఎండిపోవడాన్ని ‘జిరోస్టోమియా’ (Xerostomia) అంటారు. ఇది అనారోగ్య సమస్యలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య ఉన్నవాళ్లు ఫంగస్ తదితర ఇన్ఫెక్షన్ల బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ సమస్య ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంవల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారినపడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా నోరు అతిగా ఎండిపోయినట్టు ఉండటానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం..
నిద్రలేమి కారణంగా నోరు అతి పొడిగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ అప్సియా – హైపోప్నియా సిండ్రోమ్తో బాధపడే వ్యక్తి నిద్రించే సమయంలో వాయు మార్గంలో గాలి బ్లాకవుతుంది. దీనివల్ల వారు తరుచూ గురకతో ఇబ్బంది పడుతుంటారు. అలాగే నోరు ఎక్కువగా పొడిబారుతుంది.
నోరు ఎండిపోవడానికి మరో కారణం మెడిసిన్లు ఎక్కువగా తీసుకోవడం. చాలామంది రాత్రిపూట మందులను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల నోరు పొడిబారుతుంది. ముఖ్యంగా ఈ లక్షణం రక్తపోటు మందులను ఉపయోగించే వారికి అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడేవారిలో కూడా ఇలా నోరు పొడిబారుతుంది. ఇది లాలాజలం ఉత్పత్తి కణాల కారణంగా కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు శరీరానికి కావాల్సినంత నీటిని తీసుకోవాల్సి ఉంటుంది.
డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారిలో కూడా నోరు పొడిబారుతుంది. ఈ సమస్య కారణంగా వాంతులు, విరేచనాలు, దగ్గు లాంటి అనారోగ్య సమస్యలు కలుగుతాయి. తగినంత నీరు తీసుకోకపోవడంవల్ల డీహైడ్రేషన్కు గురవుతారు.
రేడియేషన్ థెరపీ చేయించుకునే వ్యక్తులలో నోరు పొడిబారుతుంది. ఇది మీ లాలాజల గ్రంథులను దెబ్బతీస్తుంది. దీనివల్ల నోరు ఎండిపోయే అవకాశం ఉంది.
అతిగా మద్యం సేవించే వారిలో కూడా డీహైడ్రేషన్ సమస్య కలుగుతుంది. దాంతో నోరు పొడిబారుతుంది. కాబట్టి మితంగా మద్యం తీసుకోవడం చాలా మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కలగకుండా ఉంటాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులలో కూడా ఒంట్లో చక్కెర స్థాయిలు అదుపుతప్పినప్పుడు నోరు పొడిబారుతుంది. నిద్రలో ఉండగానే దాహం వేస్తుంది. నీళ్లు తాగినాకొద్ది మూత్రవిసర్జన వెళ్లాల్సి వస్తుంది. దాంతో కంటినిండా నిద్రపోవడం కష్టమవుతుంది.