కచ్ తీరంలో 130కోట్ల కొకైన్ పట్టివేత.. 13ప్యాకెట్లు స్వాధీనం

గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణం సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌), స్పెషల్ ఆపరేషన్స్ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిందని అధికారులు తెలిపారు.

  • Publish Date - June 5, 2024 / 07:04 PM IST

విధాత, హైదరాబాద్‌ : గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణం సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్‌), స్పెషల్ ఆపరేషన్స్ బృందం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ లో రూ.130 కోట్ల విలువైన కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కొకైన్ పట్టుబడకుండా స్మగ్లర్లు సముద్ర తీరంలో దాచిపెట్టినట్లు కచ్-ఈస్ట్ డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ తెలిపారు. ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన కొకైన్ ప్యాకెట్లు గత సెప్టెంబర్‌లో ఆ ప్రాంతంలోనే స్వాధీనం చేసుకున్న కొకైన్ ప్యాకెట్ల మాదిరిగా ఉన్నాయని, ఈ ఘటనపై ఏటీఎస్ తదుపరి విచారణను నిర్వహిస్తుందని బాగ్మార్ తెలిపారు. పట్టుబడిన కొకైన్ ప్యాకెట్లు ఒక్కొక్కటి కిలోగ్రాము బరువు ఉందని… గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఏటీఎస్ పోలీసు సూపరింటెండెంట్ సునీల్ జోషి తెలిపారు.

 

 

Latest News