ఆధునిక ప్రజాస్వామ్యయుత నాగరికత సమాజంలోనూ మూక దాడుల ఘటనలు పాత కాలం నాటి రోజులను తలపిస్తున్నాయి. అదికూడా ప్రజాస్వామ్య సౌధంగా పిలుచుకునే భారత దేశంలో జరుగడం కలకలం రేపింది. ఒడిస్సాలో ఓ భవనాల నిర్మాణాల ప్రాంతంలో ఓ వ్యక్తిని బంధించి కర్రకు తలకిందులుగా కట్టివేసి కొడుతూ.. ఒక ట్రక్కు పైకి మోసుకెళ్తున్న దృశ్యం వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన మూక హింసకు నిదర్శనంగా కనిపిస్తుంది.
ఈ దుస్సంఘటనను లౌకిక వాద పాత్రికేయుడిగా గుర్తింపు పొందిన అమియా పాండవ్ ఎక్స్ లో పోస్టు చేశారు. అధికార బీజేపీ నాయకులు పశ్చిమ బెంగాల్ రాజకీయ విజయాన్ని జల్మురితో జరుపుకుంటుండగా, రాష్ట్రంలోని బీజేపీ “డబుల్ ఇంజిన్” ప్రభుత్వం అరాచకానికి అనుమతిస్తోందని ఆరోపించారు. బీజేపీ పాలనలో వలస కార్మికులపైన, సామాన్యులపైన ఒడిశాలో పదేపదే జరుగుతున్న మూక దాడులు సాధారణంగా మారిపోయాయని పాండవ్ విమర్శించారు.
#Odisha during double Engine Sarkar !
A Man is lynched today by a mob in presence of police !
CM and All ministers are busy in eating Jhalmuri for so called victory in West Bengal !
Lawlessness prevails everywhere throughout the state !@DhanadaKanta @ajitanjum @ravish_journo… pic.twitter.com/EZiQn6twz7— Amiya_Pandav ଅମିୟ ପାଣ୍ଡଵ Write n Fight (@AmiyaPandav) May 7, 2026
ఇవి కూడా చదవండి :
మామిడి తోటల సాగులో కొత్త యంత్రం..కేంద్ర మంత్రి ఆవిష్కరణ
తమిళనాడులో మారుతున్న పరిణామాలు..మరోసారి గవర్నర్ వద్దకు విజయ్
