32 మందిని పెళ్లి చేసుకున్న‌ మ‌హిళ‌.. అది జ‌ర‌గ‌క ముందే ప‌రార్..!

ఈవిడ మాత్రం ఒక‌ట్రెండు కాదు.. ఏకంగా 32 మందిని పెళ్లాడింది. మ‌రి అంద‌రితో క‌లిసి ఉంటుందా..? అంటే అది కూడా లేదు. ఆ ప‌ని జ‌ర‌గ‌క ముందే ప‌రార్ అవుతుంది. మ‌రి ఆ మ‌హిళ ఎవ‌రో తెలుసుకోవాలంటే రాజ‌స్థాన్ వెళ్లాల్సిందే.

  • Publish Date - May 13, 2024 / 10:42 PM IST

ఒక‌ట్రెండు పెళ్లిళ్లు చేసుకున్న మ‌హిళలు ఉన్నారు. ఇద్ద‌రు ముగ్గురు మ‌హిళ‌ల‌ను పెళ్లి చేసుకున్న మ‌గాళ్లు ఉన్నారు. ఇలా పెళ్లిళ్లు చేసుకోవ‌డానికి అనేక కార‌ణాలు ఉండొచ్చు. కానీ ఈవిడ మాత్రం ఒక‌ట్రెండు కాదు.. ఏకంగా 32 మందిని పెళ్లాడింది. మ‌రి అంద‌రితో క‌లిసి ఉంటుందా..? అంటే అది కూడా లేదు. ఆ ప‌ని జ‌ర‌గ‌క ముందే ప‌రార్ అవుతుంది. మ‌రి ఆ మ‌హిళ ఎవ‌రో తెలుసుకోవాలంటే రాజ‌స్థాన్ వెళ్లాల్సిందే.

రాజ‌స్థాన్‌కు చెందిన ఓ మ‌హిళ‌.. ఈజీగా మ‌నీ సంపాదించాల‌నుకుంది. ఇందుకోసం దోపిడీలు, హ‌త్యల‌ను ఎంచుకోలేదు. త‌న శ‌రీర సౌంద‌ర్యంతో మ‌గాళ్ల‌ను ఆక‌ర్షించేది. ఇక పెళ్లి చేసుకునేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకునేది. ప్ర‌తి ఒక్క‌రికి పేరు మార్చి చెప్పేది. అలా ఒక‌రిద్ద‌రిని కాకుండా ఏకంగా 32 మందిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్నాక‌.. వారితో హ‌నీమూన్‌కు ప్లాన్ చేసేది. ఇక విలువైన ఆభ‌ర‌ణాలు, న‌గ‌దు వారి నుంచి దోచుకెళ్లేది.

దోపిడీ పెళ్లికూతురు లీలలు.. వెలుగులోకి ఇలా..

బాన్స్‌వార జిల్లాలోని సంగ్వారా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓ వ్య‌క్తి ఇటీవ‌లే ఆమెను వివాహం చేసుకున్నాడు. హ‌నీమూన్ పేరిట అత‌ని వ‌ద్ద ఉన్న విలువైన ఆభ‌ర‌ణాలు, న‌గ‌దును దోచుకుని పారిపోయింది. దీంతో బాధిత వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రాజ‌స్థాన్ కేంద్రంలో చాలా మంది మ‌హిళ‌లు ఈ నేరాల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. 32 మందిని పెళ్లాడిన మ‌హిళ‌ను అనిత‌గా పోలీసులు నిర్ధారించారు. దోపిడీ పెళ్లికూతుళ్ల నెట్‌వ‌ర్క్ భారీగా ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. అనిత ఒక్క‌రే కాకుండా ఆమె గ్యాంగ్ స‌భ్యులు ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డుతూ.. మ‌గాళ్ల నుంచి అందిన‌కాడికి దోచుకున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

Latest News