Selfie | కొండపై సెల్ఫీ తీసుకోబోయి 60 అడుగుల లోయలోపడ్డ యువతి..!
Selfie : మహారాష్ట్రలోని పర్యటక ప్రదేశం బోరాన్ ఘాట్లో ఓ యువతి సెల్ఫీ తీసుకోబోయి 60 అడుగుల లోయలోకి జారి పడింది. మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో వాటిని చూసేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి అందాలను పోటీపడి మరీ తమ మొబైల్స్లో బంధిస్తున్నారు.

Selfie : మహారాష్ట్రలోని పర్యటక ప్రదేశం బోరాన్ ఘాట్లో ఓ యువతి సెల్ఫీ తీసుకోబోయి 60 అడుగుల లోయలోకి జారి పడింది. మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో వాటిని చూసేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి అందాలను పోటీపడి మరీ తమ మొబైల్స్లో బంధిస్తున్నారు.
ఈ క్రమంలో పుణెకు చెందిన ఓ పర్యాటక బృందం బోరాన్ ఘాట్ సందర్శనకు వచ్చింది. బృందంలోని నస్రీన్ అమీర్ ఖురేషీ అనే యువతి అక్కడ సెల్ఫీ తీసుకుంటుండగా జారి 60 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. వెంటనే స్పందించిన హోంగార్డు స్థానికుల సహాయంతో లోయలోకి దిగి ఆమెను కాపాడారు. యువతిని చికిత్స నిమిత్తం సతారాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
అధిక వర్షాల వల్ల మట్టి జారుడుగా ఉండటంతో ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి పేర్కొన్నారు. జిల్లాలోని పర్యటక ప్రాంతాలను శనివారం నుంచి సోమవారం వరకు మూసివేయాలని ఆదేశించారు. పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చిన యువత ప్రమాదకర ప్రదేశాల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు.