ఏనుగుల ఘర్షణ.. పర్యాటకురాలు మృతి

ఏనుగుల పోరాటం కాస్తా ఓ పర్యాటకురాలి మృతికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోఫల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరం వద్ద జరిగిన ఏనుగుల ఘర్షణ లో ఓ పర్యాటకురాలు ఏనుగు కింద పడి నలిగిపోయి మృతి చెందింది.

ఏనుగుల ఘర్షణ.. పర్యాటకురాలు మృతి

ఏనుగుల పోరాటం కాస్తా ఓ పర్యాటకురాలి మృతికి దారితీసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోఫల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కొడగు జిల్లా దుబారే ఏనుగుల శిబిరం వద్ద జరిగిన ఏనుగుల ఘర్షణ లో ఓ పర్యాటకురాలు ఏనుగు కింద పడి నలిగిపోయి మృతి చెందింది. తమిళనాడుకు చెందిన ఝాన్సీ (33) తన కుటుంబంతో కలిసి సోమవారం కావేరి నది వద్దకు వచ్చింది.

ఆ సమయంలో మావటీలు స్నానానికి తెచ్చారు. పర్యాటకులు ఆ దృశ్యాలను ఆసక్తిగా గమనిస్తుండగా, ఉన్నట్టుండి రెండు ఏనుగుల మధ్య ఘర్షణ మొదలైంది. ఆ రెండు ఏనుగులు పరస్పరం పోట్లాడుకోగా, ఒక ఏనుగు ప్రమాదవశాత్తు ఝాన్సీపై పడింది. ఏనుగు కింద నలిగిపోయిన ఝాన్సీ తీవ్ర గాయాలపాలైంది. ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాద సమయంలో ఆమె పక్కనే ఉన్న భర్త, కుమార్తె త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కళ్ల ముందే భార్య మరణించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన వన్యప్రాణుల శిబిరాల వద్ద పర్యాటకులు తగినంత దూరం పాటించాలని, ఏనుగుల వంటి భారీ జంతువుల ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

జల మండలి జీఎం కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు..రూ.100కోట్ల ఆస్తుల గుర్తింపు
Petrol | మ‌ళ్లీ పెట్రో బాదుడు.. లీట‌ర్‌కు 90 పైస‌ల చొప్పున పెంపు