2జీ ధరలోనే 4జీ ఫోన్‌ను పరిచయం చేసిన జియో.. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో..!

2జీ ధరలోనే 4జీ ఫోన్‌ను పరిచయం చేసిన జియో.. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌తో..!

దేశీయ ప్రముఖ టెలికాం కంపెనీ జియో సరికొత్త సరికొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. అత్యాధునిక ఫీచర్లతో, అడ్వాన్స్‌డ్‌ కాన్ఫిగరేషన్‌తో ప్రైమా పేరుతో జియో ఫోన్‌ను తీసుకువచ్చింది. ఇందులో 2.4 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ప్రైమాలో 1800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌ ఏకంగా 23 భాషలను సపోర్ట్ చేస్తుంది. అన్ని రిలయన్స్ రిటైల్ స్టోర్స్, రిలయన్స్ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్ అందుబాటులోకి ఉంటుంది.


అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తదితర ఈ కామర్స్‌ వైబ్‌సైట్లలోనూ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రైమా 4జీ నెట్‌వర్క్‌తో పని చేసే కీ ప్యాడ్‌ స్మార్ట్‌ఫోన్‌. కంపెనీ ఈ ఫోన్‌ ధరను రూ.2,599 గా నిర్ణయించింది. ఈ మొబైల్‌లో యూట్యూబ్, ఫేస్‌బుక్‌, వాట్సాప్ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌, గూగుల్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ తదితర ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీడియో కాలింగ్‌ కోసం డిజిటల్‌ కెమెరాను పొందుపరిచారు.


అదనంగా ఇందులో జియో టీవీ, జియో సినియా, జియో సావన్, జియో పే తదితర జియో డిజిటల్ సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే కీ ప్యాడ్ ఫోన్‌తో స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని పొందే వీలున్నది. అయితే, కంపెనీ భారత్‌లో 2జీ ఫోన్లకు ముగింపు పలికే లక్ష్యంతో ఈ మోడల్‌ను పరిచయం చేసింది. 2జీ మొబైల్‌ ధరలోనే 4జీ ఫీచర్స్‌తో ఫోన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్నివర్గాలు ఉపయోగించేలా తీర్చిదిద్దారు. అద్భుతమైన రంగులు సరికొత్త డిజైన్, స్టయిలిష్‌ లుక్‌, ఎర్గోనామిక్‌ డిజైన్‌తో ఫోన్‌ను జియో తీసుకువచ్చింది.