Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా రైల్వేలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నది. ప్రయాణికులకు ఈ అత్యాధునిక రైళ్లు త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే వేగంతో పాటు సౌకర్యాలు ఈ రైళ్లలో అందివ్వనున్నది.
Vande Bharat Sleeper | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా రైల్వేలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టబోతున్నది. ప్రయాణికులకు ఈ అత్యాధునిక రైళ్లు త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే వేగంతో పాటు సౌకర్యాలు ఈ రైళ్లలో అందివ్వనున్నది. అయితే, ఈ రైళ్ల ప్రారంభోత్సవం కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రాబోయే రెండు నెలల్లో రైలు పట్టాలపై పరుగులు తీస్తుందని వెల్లడించారు.
ఆగస్టు 15 నాటికి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. రైల్వేశాఖ వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆయా రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. అయితే, వందే భారత్ ఎక్స్ప్రెస్లలో కేవలం కూర్చుండి ప్రయాణించేందుకు మాత్రమే అవకాశం ఉంది. ఈ క్రమంలో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు కూర్చుండి ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో వందే భారత్లో స్లీపర్ వర్షెన్ తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. అత్యాధునిక సౌకర్యాలతో వందే భారత్ స్లీపర్ రైళ్లను రైల్వేశాఖ సిద్ధం చేసింది.
ప్రస్తుతం రైళ్ల పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో ఆగస్టు 15 వరకు ప్రారంభించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సందర్భంగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు తీయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. రైళ్ల కోసం ప్రత్యేకంగా రెండు ప్రత్యేకంగా ట్రాక్లను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆయా ట్రాక్లపై ట్రయల్ పూర్తయ్యాక ప్రయాణికులకు స్లీపర్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రయోగ దశలో నాలుగు స్లీపర్ క్లాస్ కోచ్లతో రైలును సిద్ధం చేసినట్లు చెప్పారు. అయితే, రాబోయే ఐదేళ్లలో సుమారు 400 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వివరించారు.