IRCTC Best Package: మిస్టికల్ కాశ్మీర్ న్యూ ఇయర్ స్పెషల్ ట్రిప్ కేవలం రూ. 35550 మాత్రమే
కాశ్మీర్ యాత్ర అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది చాల లోతైన పచ్చని లోయలు, మంచు శిఖరాలు, అందమైన మొఘల్ గార్డెన్స్, దాల్ సరస్సులో హౌజ్ బూటులు, షికరా రైడ్లు, గుల్మార్గ్, పహల్గామ్, సోన్ మార్గ్ వంటి కనువిందు చేసే ఎంతో సుందరమైన ప్రదేశాలు, శీతాకాలంలో మంచు అందాలు, పశ్మీనా శాలువలు, సంప్రదాయ ఖలా ఖండాలు. ఇన్ని అందాలు ఉన్న కాశ్మీర్ను భూతల స్వర్గం అంటారు. అలాంటి ప్రదేశాన్ని చూపించేందుకు నూతన సంవత్సర సందర్భంగా IRCTC రూ.35550కే బెస్ట్ ప్యాకేజీని తీసుకు వచ్చింది.
కాశ్మీర్ యాత్ర అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది చాల లోతైన పచ్చని లోయలు, మంచు శిఖరాలు, అందమైన మొఘల్ గార్డెన్స్, దాల్ సరస్సులో హౌజ్ బూటులు, షికరా రైడ్లు, గుల్మార్గ్, పహల్గామ్, సోన్ మార్గ్ వంటి కనువిందు చేసే ఎంతో సుందరమైన ప్రదేశాలు, శీతాకాలంలో మంచు అందాలు, పశ్మీనా శాలువలు, సంప్రదాయ ఖలా ఖండాలు. ఇన్ని అందాలు ఉన్న కాశ్మీర్ను భూతల స్వర్గం అంటారు. అలాంటి ప్రదేశాన్ని చూపించేందుకు నూతన సంవత్సర సందర్భంగా IRCTC రూ.35550కే బెస్ట్ ప్యాకేజీని తీసుకు వచ్చింది.
యాత్ర పూర్తి వివరాలు చూసుకున్నట్లైతే… ఈ నెల 29 ప్రారంభం అవుతుంది. 29వ తేదీన ఉదయం 7 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ నెంబర్ 6E-495/6288 నుంచి శ్రీనగర్కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్కు చేరుకుంటారు. సాయంకాలం శ్రీనగర్లో గడిపి రాత్రికి హోటల్లో బస చేస్తారు.
మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్ చేసి సోన్ మార్గ్ బయలు దేరుతారు. సోన్ మార్గ్ సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మంచు కొండలపై అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. సింధూ నది ఇక్కడ వంపులు తిరుగుతూ ప్రవహిస్తూ ఎంతో సుందరంగా కనిపిస్తుంది. అది చూసిన తర్వాత తిరిగి సాయంత్రం శ్రీనగర్ హోటల్ చేరుకుంటారు.
మూడవ రోజు ఉదయం అప్పహారం ముగిశాక గుల్ మర్గ్ బయలు దేరుతారు. రోడ్లంతా అందమైన పూవులతో కనువిందు చేస్తాయి. ఇక్కడ గోండోలా రైడ్ను ప్రయాణికులు సొంతంగా టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గుల్ మార్గ్ చూశాక తరిగి హోటల్ చేరుకుంటారు.
మరుసటి రోజు ఎదావిధిగా బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేసి పహల్గామ్ బయలు దేరుతారు. ఇది సముద్ర మట్టానికి 2440 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించేట్టప్పడు చూట్టూ కుంకుమ పూల వ్యవసాయ క్షేత్రాలు, అవంతిపూర్ శిథిలాలు కనువిందు చేస్తాయి. భారత చలన చిత్రాలు పహల్గామ్ ఎంతో పేరుగాంచిన ప్రదేశం. బతీబ్ వ్యాలీ, చందన్ వారీ, అరు వ్యాలీలో పకృతి సౌందర్యమైన లోయలు మంత్రముగ్ధల్ని చేస్తాయి. జీవితంలో ఒక్క సారైనా పహల్గామ్ చూడాల్సిన ప్రదేశం. సాయంత్రం పహల్గామ్లోనే హోటల్లో బస చేస్తారు.
ఐదవ రోజు ఉదయం టిఫిన్ గట్రా ముగించేసుకుని శ్రీనగర్ బయలుదేరుతారు. శ్రీనగర్లో ఎంతో ప్రత్యేకమైన శంకరాచార్య ఆలయం దర్శించుకుంటారు. ఆ రోజు సాయంకాలం డాల్ లేక్ వైపు శిఖర రైడింగ్ వెళ్తారు. అక్కడ సన్ సెట్, చార్ చినార్(తేలి ఆడే ఉద్యాన వనాలు) ఎంజాయ్ చేయవచ్చు. సాయంత్రం హౌస్ బోట్లో చెకిన్ అవుతారు. రాత్రికి డిన్నర్ బస అందులోనే చేయల్సి ఉంటుంది.
ఇక చివరగా ఆరవ రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని మొగల్ గార్డెన్స్ సందర్శిస్తారు. బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ చూసి శ్రీనగర్ ఎయిర్ పోర్డ్ చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 2:55 గంటలకు 6E-044/6617 ఫ్లైట్ ఎక్కి రాత్రి 8:30 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు.
టికెట్ ధరలు: ఈ యాత్రకు ఒక్కరు మాత్రమే వెళ్తే రూ. 47100 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి వెళ్తే ఒక్కొక్కరు రూ.36950, అదే ముగ్గురు కలిసి వెళ్తే ఒక్కొక్కరూ రూ.35550 చెల్లించాలి. 5నుంచి 11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు అయితే బెడ్తో అయితే రూ.30050, వితౌట్ బెడ్ అయితే రూ,27450 చెల్లించాలి. అదే 2 నుంచి 4 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకైతే రూ.21400 చెల్లించాలి.
నోట్ : పూర్తి వివరాల కోసం IRCTC వెబ్ సైట్ను సందర్శించగలరు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram