విధాత: ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆయన తనయులు – ప్రముఖ పారిశ్రామిక వేత్త, మాగుంట రాఘవరెడ్డి ఈ రోజు డిల్లీలోని తన కార్యాలయంలో అన్ని పార్టీలకు చెందిన మంత్రులు మరియు పార్లమెంటు సభ్యులు 70 మందికి ఆత్మీయ విందు ఇచ్చినారు. ఈ విందు కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి మీనాక్షి లేఖీ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయక మంత్రి, అనుప్రియా పటేల్, పార్లమెంటు సభ్యులు మాజీ న్యాయ శాఖ సహాయక మంత్రి పి.పి.చౌదరి , పార్లమెంటు సభ్యులు మరియు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, గిరీష్ బాలచంద్ర బాపట్ , పార్లమెంటు సభ్యులు మరియు మాజీ గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్కో సర్ దిన్ హా , పార్టీల ఫ్లోర్ లీడర్లు, పినాకి మిశ్రా (BJD), నామా నాగేశ్వర రావు (TRS), నితేష్ పాండే (BSP), పార్లమెంటు సభ్యులు, కార్తీ చిదంబరం , కనిముళి కరుణానిధి , మాజీ కేంద్ర మంత్రి, ప్రఫుల్ పటేల్ , పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ , నిషికాంత్ దూబే , ప్రియాంకా చతుర్వేది (రాజ్య సభ సభ్యులు), మాజీ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ కుమారులు, నీరజ్ శేఖర్ , విజయసాయిరెడ్డి , పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి , వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి , లావు కృష్ణదేవరాయలు , గళ్ళా జయదేవ్ , కింజరపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని , రేవంత్ రెడ్డి , సుప్రియా సూలే , సుమలత అంబరీష్ , గొద్దేటి మాధవి , దానే సలీ , P.C. మోహన్ , శివకుమార్ ఉదాశీ సౌగత రాయ్ (AITC), హిబి ఇడెన్ (INC), మనిక్కం ఠాగూర్ , డా. కళానిధి వీరస్వామి తదితర పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.