లాడర్హిల్( Lauderhill)లో జరగాల్సిన అమెరికా–ఐర్లండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించగా, 5 పాయింట్లతో అమెరికా సూపర్–8కు చేరింది. అంతేకాదు, ఈ మ్యాచ్లో ఐర్లండ్ గెలవాలని కోరుకున్న పాకిస్తాన్ ఇంటిముఖం (Pakistan out)పట్టింది
టి20 ప్రపంచకప్(Mens T20 World Cup 2024)లో భాగంగా నేడు లాడర్హిల్, ఫ్లోరిడాలో జరగాల్సిన అమెరికా, ఐర్లండ్(USA-Ireland) మ్యాచ్కు వరుణదేవుడు అడ్డం పడ్డాడు(Match abandoned). రాత్రంతా కురిసిన వర్షం కారణంగా ఔట్ఫీల్డ్ పూర్తిగా చిత్తడిగా మారింది. గ్రౌండ్ సిబ్బంది ఎడతెరిపి లేకుండా శ్రమపడి, కనీసం 5 ఓవర్ల మ్యాచయినా సాధ్యపడేలా చేసారు. అంపెర్లు కూడా ఇది 5 ఓవర్ల మ్యాచ్ అని ప్రకటించారు. తీరా టాస్ వేయాలనుకునే టైమ్ మళ్లీ వర్షం మొదలవడంతో మ్యాచ్ను ఒక్క బంతి కూడా పడకుండానే అధికారికంగా రద్దు చేస్తూ, అమెరికా, ఐర్లండ్లకు తలా ఒక పాయింట్ కేటాయించారు. దీంతో యుఎస్ఏ అధికారికంగా సూపర్–8లోకి (USA in Super 8) అడుగుపెట్టింది. అమెరికాకు ఇంకో బహుమతి కూడా దక్కింది. సూపర్–8లో చోటు దక్కడం వల్ల వచ్చే వరల్డ్కప్కు క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడకుండానే నేరుగా 12 అర్హత జట్లలో చోటు సంపాదించింది(USA qualify automatically for T20 World Cup 2026). భారత్, శ్రీలంక సంయుక్తంగా టి20 ప్రపంచకప్–2026కు ఆతిథ్యమివ్వబోతున్నాయి.
ఇక ఇప్పటికే గ్రూప్–ఏ నుండి భారత్ 6 పాయింట్లతో అగ్రస్థానం(India Group A topper- A1)తో సూపర్–8కు దూసుకెళ్లగా, రెండో స్థానం కోసం అమెరికా, పాకిస్తాన్ ఆశలు పెట్టుకున్నాయి. ఇవాళ అమెరికా ఓడిపోయి, పాకిస్తాన్ ఐర్లండ్పై గెలిస్తే, అమెరికా, పాక్లు చెరో నాలుగు పాయింట్లతో ఉంటాయి. మెరుగైన రన్రేట్తో ఉన్న జట్టు రెండో స్థానానికి చేరి సూపర్–8కు వెళ్లేది. ఈ సమీకరణంపై గంపెడన్ని ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్పై వరుణుడు ఒక్కసారిగా కుండెడు నీళ్లు కుమ్మరించాడు. అదనంగా వచ్చిన ఒక పాయింట్తో 5 పాయింట్లకు చేరిన అమెరికా (A2)జట్టు సూపర్–8కు, భారత్తో పాటు బయల్దేరింది. ఈ మ్యాచ్ ఫలితంతో పాకిస్తాన్, ఐర్లండ్ జట్లు అధికారికంగా టోర్నీ నుండి నిష్క్రమించాయి(Pakistan , Ireland out ot World cup). ఆశ్యర్యకరంగా ఈసారి పెద్ద జట్లే పోటీ నుండి బయటకెళ్లిపోవడం విచిత్రంగా ఉంది. ఇప్పటికే న్యూజీలాండ్, శ్రీలంక జట్లు దూరమవగా, ఇప్పుడు పాకిస్తాన్ వంతు అయింది. ఇక ఇంగ్లండ్పై కత్తి వేలాడుతోంది.
రేపు ఇదే గ్రౌండ్తో భారత్, కెనడా(India-Canada)ల మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగాల్సిఉంది. దీనికి కూడా వానగండం ఉన్నా, దీని ఫలితంతో ఇరుజట్ల భవిష్యత్తుపై ఎటువంటి ప్రభావం ఉండదు. కాకపోతే గెలిస్తే భారత్కు 8 పాయింట్లు వచ్చేవి. అంతే.