IPL 2025 |18 ఏళ్ల నిరీక్షణకు ఒక్క అడుగు దూరంలో..

రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరు ఐపిఎల్​–2025లో కప్పు ఒడిసిపట్టుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. నేడు జరిగిన క్వాలిఫయర్​–1(Qualifier-1) మ్యాచ్​లో మొదటిస్థానంలో ఉన్న పంజాబ్(Punjab Kings)​ను అవలీలగా మట్టికరిపించి నేరుగా ఫైనల్​కు చేరుకుంది.

IPL 2025 |18 ఏళ్ల నిరీక్షణకు ఒక్క అడుగు దూరంలో..

గతంలో బెంగళూరు (Royal Challengers Bengaluru)మూడు సార్లు ఫైనల్​కు చేరుకున్నా, అన్నింటిలో ఓడిపోయి కప్పు అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. ఫైనల్​కు చేరుకోవడం బెంగళూరుకు ఇది నాలుగోసారి. ఈసారైనా కప్​ కొట్టి, 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న విరాట్​ కోహ్లీ(Virat Kohli)కి ఘన బహుమతిగా ఇవ్వాలనేది జట్టు  కోరిక. అన్నట్లు కోహ్లీ జెర్సీ నెంబర్​ కూడా 18.

టాస్​ గెలిచి, పంజాబ్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించిన బెంగళూరు, తన నిర్ణయం సరైనదేనని నిరూపించుకుంది. బెంగళూరు బౌలర్లు పంజాబ్​ను నిప్పులవంటి బంతులతో హడలెత్తించారు. రెండో ఓవర్లోనే పంజాబ్​ వికెట్ల పతనానికి నాంది పలికిన బెంగళూరు బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పరుగులు రాబట్టడం గగనమైపోయింది. దాదాపు ప్రతీ పది పరుగులకో వికెట్​ కోల్పోయిన పంజాబ్​ మొత్తానికి 101 పరుగులకు ఆలౌట్​ (101 Allout)అయింది. 26 పరుగులు చేసిన స్టెయినిస్​ టాప్​ స్కోరర్​.  ఆర్సీబీ బౌలర్లలో హేజిల్​వుడ్​, సుయశ్​ శర్మ మూడు వికెట్లతో రాణించగా, యశ్​దయాల్​ 2, భువనేశ్వర్​, షెప్పర్డ్​ చెరో వికెట్​ తీసుకున్నారు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు, ధాటిగా ప్రారంభించినా, కోహ్లీ(12) వికెట్​ను త్వరగానే కోల్పోయింది. మరో ఓపెనర్​ ఫిల్​ సాల్ట్​(56 నాటౌట్​)(Phil Salt) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి, మయాంక్​, పటీదార్ల సహకారంతో పని పూర్తిచేసాడు. చివరికి సరిగ్గా పది ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు(106 for 2) చేసి ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. జేమీసన్​, ముషీర్​ చెరో వికెట్​ సాధించారు.

రేపు గుజరాత్​, ముంబై జట్ల మధ్య జరుగబోయే ఎలిమినేటర్(Eliminator)​ మ్యాచ్​ విజేతతో నేడు ఓడిపోయిన పంజాబ్​ క్వాలిఫయర్​–2(Qualifier-2) మ్యాచ్​ ఆడుతుంది. ఒకవేళ అందులో గెలిస్తే, మళ్లీ బెంగుళూరుతోనే ఫైనల్​ ఆడాల్సివుంటుంది.