ఆగస్టు 15 లోగా 69 లక్షల మంది రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నారాయణ పేట వేదిక గా రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు
– నారాయణ పేట వేదిక గా ముఖ్య మంత్రి వెల్లడి
– 69 లక్షల రైతు లకు రూ.రెండు లక్షల రుణమాఫి
– కవిత బెయిల్ కోసం మోడీ కి కెసిఆర్ సుపారీ
– కూతురి కోసం మోడీ వద్ద తెలంగాణ ఆత్మ గౌరవం తాకట్టు పెట్టిన కెసిఆర్
– కాంగ్రెస్ ను పడగొట్టేందుకు బీజేపీ, బీ ఆర్ ఎస్ కుట్రలు
– ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ ని గెలిపించేందుకు మోడీ తో కెసిఆర్ కుమ్మక్కు
– మోడీ, కెసిఆర్ పదేళ్ల పాలనలో పాలమూరు ఎండి పోయింది
– ఆగస్టు 15 నాటికి 69 లక్షల రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ
– పథకాల అమలుకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు
– గద్వాల బంగ్లా రాజకీయాలను తిప్పికొట్టాలి
– నారాయణ పేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు
– నారాయణ పేట జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : ఆగస్టు 15 లోగా 69 లక్షల మంది రైతులకు రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని నారాయణ పేట వేదిక గా రాష్ట్ర ముఖ్య మంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నందుకు రుణ మాఫి ప్రక్రియ నిలిచి పోయిందన్నారు.సోమవారం నారాయణ పేట నియోజకవర్గ కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన జాతర సభలో పాల్గొన్న సీఎం ప్రజలను ఉద్దెశించి ప్రసంగించారు.కూతురు కవిత బెయిల్ కోసం ప్రధాని మోడీ వద్ద తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాకట్టు పెట్టారని…. కాంగ్రెస్ ను పడగొట్టేందుకు బీజేపీ, బీ ఆర్ ఎస్ కుట్ర లు చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు కేంద్రం లో ఉన్న బీజేపీ, రాష్ట్రం లో బీ ఆర్ ఎస్ అన్ని రంగాలను విద్వoసం చేశాయని, ఇప్పటికీ తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ ని వంద అడుగుల లోతున పూడ్చి పెట్టారని,వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ని కూడా పాతిపెట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
కృష్ణా, వికారాబాద్ రైల్వే లైన్ ను కాంగ్రెస్ పార్టీ మంజూరు చేయిస్తే బీ ఆర్ ఎస్, బీజేపీ కుట్రలు పన్ని అపారన్నారు.మళ్ళీ రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తరువాత ఈ రైల్వే లైన్ మంజురు కు ప్రత్తిపాదన పెట్టమన్నారు. మక్తల్, నారాయణ పేట నియోజకవర్గాలకు కృష్ణా నది సమీపంలో ఉన్నా ఈ ప్రాంతానికి చుక్క నీరు రావడం లేదని, ఇది దృష్టిలో పెట్టుకుని కృష్ణా నది నీటిని వాడుకునేందుకు నారాయణ పేట, కొడంగల్ లిఫ్ట్ ద్వారా 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక చేస్తున్నామని సీఎం ప్రకటించారు.గత ప్రభుత్వం ఈ లిఫ్ట్ ను పట్టించుకోలేదని దీంతో ఈ నియోజకవర్గాలు సాగు నీరు లేక పొలాలు బీడు బారి పోయాయన్నారు.బీ ఆర్ ఎస్ హయాంలో పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చేసిందని, చేపట్టిన సాగునీటి ప్రాజెక్టు లు ఎక్కడికక్కడ అసంపూర్తి దశ లో నిలిచిపోయాయని రేవంత్ రెడ్డి అన్నారు. వైస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 35 లక్షల ఇందిరమ్మా ఇళ్ళు నిర్మిస్తే పదేళ్ల బీ ఆర్ ఎస్ పాలన లో ఒక్క డబుల్ bed రూమ్ ఇళ్ళు వచ్చాయయ ని ప్రజలను అడిగారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గాని 35 వేల ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించేందుకు రూ. ఐదు లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున రైతు రుణ మాఫి చేయలేక పోయమని, ఆగస్టు 15 నాటికి 69 లక్షల మంది రైతులకు రెండు లక్షల రుణ మాఫి చేస్తమన్నారు.వంద రోజుల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని, ఇదివరకే మహిళ లకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతు బంధు వంటి పథకాలు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.పదేళ్లు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా కాంగ్రెస్ జెండా వీడలేదని, మక్తల్ లో ముదిరాజ్, షాద్ నగర్ లో రజక బిడ్డ కు అసెంబ్లీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న ఘనత కాంగ్రెస్ దే. అన్నారు.మేమూ కొంట్రాక్టర్లకు, జామిందర్లకు టికెట్ ఇవ్వలేదని పేద వర్గాలకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ కి ఉండన్నారు.
కేంద్రం లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ముదిరాజ్ లను బీసీ డి నుంచి ఏ కు మార్చేoదుకు బిల్లు పెట్టే విధంగా కృషి చేస్తామన్నారు. అలాగే తెలంగాణ లో 14 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే ముదిరాజ్ వర్గానికి మంత్రి పదవి ఇస్తామన్నారు.పదేళ్లు మాదిగల వర్గీకరణ పట్టించుకోలేని బీ ఆర్ ఎస్ కు ఏ వర్గం ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో బిల్లు పెడుతుందన్నారు. గతంలో అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ కోసం తాను, సంపత్ కుమార్ కొట్లాడితే అసెంబ్లీ నుంచి గెంటివేసిన చరిత్ర బీ ఆర్ ఎస్ దే అన్నారు.కెసిఆర్ చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలు వంద అడుగుల లోతులో బీ ఆర్ ఎస్ ను పాతిపెట్టారన్నారు. గతంలో మందకృష్ణ ను అన్యాయం గా అరెస్ట్ చేస్తే అండగా నిలబడ్డా నని, అలాంటి వ్యక్తి బీజేపీ పంచన చేరారని రేవంత్ అన్నారు.
కెసిఆర్ నిర్లక్ష్యం నికి ముదిరాజ్ లు తీవ్రంగా నష్ట పోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ముది రాజులకు
సముచిత న్యాయం జరుగుతుందన్నారు.గద్వాల లో కోట లో కుట్ర పన్ని మామ,అల్లుడు కలిసి కురుమ బిడ్డ సరితమ్మ ను ఓడగొట్టారన్నారు. ఆమె గెలిస్తే మంత్రి పదవి దక్కేదని రేవంత్ పేర్కొన్నారు.గద్వాల బంగ్లా రాజకీయాలను కురుమ యాదవులు తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు.
. మెదక్ లో యాదవ బిడ్డ అనిల్ కు రాజ్యసభ కు పంపించామన్నారు . నారాయణ పేట కు అందరిగ్రౌండ్ డ్రైనేజి మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు.తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు.. ఉద్యోగాలు…. ఇందులో ఏమైనా కెసిఆర్ చేశాడా… వారి కుటుంబం లో పదవులు వచ్చాయి.. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు స్టేడియంలో ఇచ్చిము… పదేళ్ల లో వందేళ్ల విద్వాంసం కెసిఆర్ చేస్తే దాన్ని మేమూ సరిదిద్దుకుంటూ వస్తున్న.. పేదోడి బిడ్డ సీఎం అయితే ఓర్వలేక పోతున్నారు.. పాలమూరు బిడ్డ సీఎం కావద్దా…మన్నే శ్రీనివాస్ రెడ్డి ని గెలిపించారు.. ఆయన ఏడ ఉన్నాడు… అని రేవంత్ అన్నారు.
వచ్చే ఏడు పండించే పంటకు 500 బోనస్ ఇస్తానని ప్రకటించారు.గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీ లా ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు.ఇంత గెలిచి రచ్చ గెలవాలని, జిల్లా లో 14 స్థానాలకు 12 ఇచ్చినo దుకే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి జిల్లా లోని రెండు స్థానాలు గెలిపించాలని సీఎం కొరారు.
అరుణమ్మ ను దొరసాని అని అనవద్దంటా… నేను బరాబరి అంటా.. ఆమెను దొరసాని అని ఎందుకు అనకూడదు… పూటకో పార్టీ మార్చే దొరసాని… అహంకార.. అవకాశవాద దొరసాని.. అని నేను అంటాను.. అని మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ఈ సభలో ఎమ్మెల్యే లు శ్రీహరి, పర్ణిక రెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, శంకర్, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, నేతలు సరిత, హర్ష వర్ధన్ రెడ్డి, స్వర్ణ మ్మ , ఒబేదుళ్ల కొత్త్వాల్, కుంభం శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు.