హైదరాబాద్ బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కూలీలు చనిపోయిన ఘటనపై సీఎం రేంవత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్రెడ్డి భరోసా
విధాత : హైదరాబాద్ బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కూలీలు చనిపోయిన ఘటనపై సీఎం రేంవత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను సీఎం రేవంత్రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కుండపోత వర్షం పడడంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు తెలిపారు.
భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడుగురు మంది మృతి .. మరో నలుగురికి గాయాలైనట్లు పేర్కోన్నారు. చనిపోయిన వారు ఒరిస్సా, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారని, వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, 4 పురుషులు ఉన్నారని తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ హామీ ఇచ్చారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను రేవంత్రెడ్డి ఆదేశించారు.