విధాత:నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఓ మహిళకు కరోనా వాక్సిన్ కు బదులుగా యాంటీ రాబిస్ వేశారు.వివరాల్లోకి వెలితే బొల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పని చేస్తున్న ప్రమీల పాఠశాల కు వాక్సిన్ తీసుకొని విధుల్లోకి రావలనడంతో తను ప్రధానోపాధ్యయుడి ద్వారా తనకు వ్యాక్సిన్ వేయాలని లెటర్ తీసుకొని అక్కడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది అక్కడ ఒక గది లో కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా మరో గదిలో సాధారణ విధులు నిర్వహిస్తున్నారు.ప్రమీల తెలియక […]
విధాత:నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఓ మహిళకు కరోనా వాక్సిన్ కు బదులుగా యాంటీ రాబిస్ వేశారు.వివరాల్లోకి వెలితే బొల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పని చేస్తున్న ప్రమీల పాఠశాల కు వాక్సిన్ తీసుకొని విధుల్లోకి రావలనడంతో తను ప్రధానోపాధ్యయుడి ద్వారా తనకు వ్యాక్సిన్ వేయాలని లెటర్ తీసుకొని అక్కడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లింది అక్కడ ఒక గది లో కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా మరో గదిలో సాధారణ విధులు నిర్వహిస్తున్నారు.ప్రమీల తెలియక ఆ గదిలోకి వెల్లడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సు లెటర్ చూడకుండనే యాంటీ రాబిస్ వేశారని చెప్పింది.కానీ ఆసుపత్రి సిబ్బంది మాత్రం తాను ఏ లెటర్ చూపించలేదని ఆమె అడగడం వలనే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశామన్నారు.దీంతో సదరు మహిళ ఆందోళన చేయడంతో ఉన్నత అధికారులు విచారణ చేస్తున్నారు.