బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఈ నెల 25 గురువారం రోజున నామినేషన్ దాఖలు
*నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్
*నామినేషన్ సందర్బంగా తలపెట్టిన బైక్ ర్యాలీ విజయ వంతం చేయండి.
బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు.
విధాత బ్యూరో, కరీంనగర్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఈ నెల 25 గురువారం రోజున నామినేషన్ దాఖలు చేయనున్నారని పార్టీ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తెలిపారు. నామినేషన్ సందర్భంగా తలపెట్టిన బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని బిజెపి శ్రేణులంతా ఆరోజు ఉదయము 8 గంటలకు ఎస్ ఆర్ ఆర్ కాలేజ్ వద్దకు తరలిరావాలని పిలుపునిచ్చారు.నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేందర్ పటేల్ హాజరవుతారని తెలిపారు.