Telugu Film Chamber | తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా నిర్మాత భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది సభ్యుల్లో 46 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు పోలయ్యాయి

విధాత, హైదరాబాద్ : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా నిర్మాత భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది సభ్యుల్లో 46 మంది సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ కు 28 ఓట్లు రాగా, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి. దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ఈ సారి ఎన్నికల బరిలో భరత్ భూషణ్తో పాటు, ఠాగూర్ మధు పోటీ చేశారు. కాగా ఫిల్మ్ ఛాంజర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ గెలిచాడు. భరత్ భూషణ్ను డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి సభ్యులు ఎన్నుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్ , వైవీఎస్ చౌదరి పోటీ చేశారు. ప్రొడ్యూసర్స్ , ఎగ్జిబిటర్స్ , డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టార్లోని సభ్యులు ఓట్లు వేశారు. ఇక గత ఐదేళ్ల పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్కి అధ్యక్షుడిగా దిల్ రాజు ఉండగా.. ఈసారి ఇద్దరు నిర్మాతలు పోటీలో నిల్చున్నారు.