విధాత:Q News కార్యాలయం లో పోలీసుల సోదాలను ఖండిస్తున్నాను.ప్రశ్నించే గొంతును నొక్కేసేందుకే Q News పై దాడి. ముఖ్యమంత్రి, ఆయన అనుచరుల అవినీతి, భూ కబ్జా ఆధారాలను మాయం చేసేందుకు మల్లన్న ఆఫీస్ ను సీజ్ చేసే కుట్ర జరుగుతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
ఈ రాష్ట్రం లో సీఎం, టీఆరెస్ నేతలను మించిన అవినీతి పరులు లేరు.పోలీసులు చట్ట ప్రకారంగా వ్యవహరించాలి.సీఎం అవినీతిని ప్రశ్నించే వాళ్ళను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు.తీన్మార్ మల్లన్న పై ఆరోపణలు వస్తే ముందుగా నోటీస్ ఇవ్వాలి కదా,ప్రశ్నించే గొంతులను మూయడం ఈ సీఎం తరం కాదన్నారు.