Indiramma Houses । ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లు, ఇళ్లు వేలం వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఏళ్ల తరబడి వృథాగా ఉంచడం సరికాదని, వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలన్నారు.

Indiramma Houses । ఇందిరమ్మ కమిటీలను దసరా పండుగ నాటికి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ/ వార్డు, మండల/ పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధి విధానాలను ఒకటి రెండు రోజుల్లో రూపొందించాలని చెప్పారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు దక్కాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ఇతర రాష్ట్రాలు లక్షల సంఖ్యలో గృహాలు మంజూరు చేయించుకుంటున్నాయని, ఈ విషయంలో తెలంగాణ వెనుకబడి ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఈసారి కేంద్రం మంజూరు చేసే గృహాల్లో గరిష్ఠ సంఖ్యలో రాష్ట్రానికి ఇళ్లు సాధించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీఎంఏవై కింద రాష్ట్రానికి రావల్సిన బకాయిలు రాబట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారం వెంటనే ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో డాటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తే ఇంజినీరింగ్ సిబ్బంది సమస్య ఎదురయ్యే పరిస్థితి ఉంటుందని అధికారులు తెలపగా… అవసరమైతే ఔట్సోర్సింగ్ పద్ధతిన నియామకాలు చేపట్టాలని ముఖ్యమంత్రి అన్నారు.
రాజీవ్ స్వగృహలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లు, ఇళ్లు వేలం వేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఏళ్ల తరబడి వృథాగా ఉంచడం సరికాదని, వెంటనే వేలానికి రంగం సిద్ధం చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయినా వాటిని ఎందుకు అప్పగించలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. అర్హులకు ఆ ఇళ్లను అప్పగించాలన్నారు. హైదరాబాద్ నగరంలో నిర్మించి నిరుపయోగంగా ఉన్న బ్లాక్లకు మౌలిక వసతులు కల్పించి, వాటికి అర్హులైన లబ్ధిదారులకు అప్పగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాష్, తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఎండీ వి.పి.గౌతమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.