పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి, బీఆరెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మధ్య పరస్పర మాటల యుద్ధం సాగుతుంది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై టుగా స్పందించారు
ఫ్రీ బస్సు గ్యారంటీ అమలు తెలుస్తుంది
సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
విధాత : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి, బీఆరెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మధ్య పరస్పర మాటల యుద్ధం సాగుతుంది. ఈ క్రమంలో ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై టుగా స్పందించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు కాలేదంటున్న కేటీఆర్.. నువ్వు చీర కట్టుకుని ఆడపిల్లలా… మంచిగా తయారై.. ఆర్టీసీ బస్సు.. ఎక్కు.. కండక్టర్ నిన్ను టికెట్ డబ్బులు అడిగితే ఆరు గ్యారంటీలు అమలు కాలేదని అప్పుడు ఒప్పుకుంటామని, లేదంటే తాము ఇచ్చిన హామీలు అమలు అయినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదని, రాష్ట్ర విభజన హామీలు, అభివృద్ధి పథకాలు ఇవ్వమంటే గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు అన్ని హామీలు అమలు చేస్తామని, 9వ తేదీలోగా అందరికి రైతుబంధు ఇస్తామని, ఆగస్టు 15వ తేదీలోగా 2లక్షల రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అదిలాబాద్ అంటే నాకు ప్రత్యేక అభిమానమని, దత్తత తీసుకుని అభివృద్ధి చేసే నాదేనని రేవంత్రెడ్డి ప్రకటించారు.