Jubilee Hills By Poll Counting | ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో నవీన్ యాదవ్
Jubilee Hills By Poll Counting | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.
Jubilee Hills By Poll Counting | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. హోమ్ ఓటింగ్ ద్వారా 101 మంది వృద్ధులు, వికలాంగులు ఓటేశారు. వీరంతా నవీన్ యాదవ్కే ఓటేసినట్లు తెలిసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.
మధ్యాహ్నం 2 గంటల సమయానికి తుది ఫలితం వెలువడనుంది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించారు.
మొత్తం 10 రౌండ్లు.. ఒక్కో రౌండ్కు 40 నిమిషాలు..
ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో ఉప ఎన్నిక ఫలితం వెలువడనుంది. అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉండడంతో ఒక్కో రౌండ్కు 40 నిమిషాలకు పైగా సమయం పడుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. మొత్తానికి మధ్యాహ్నం 2 గంటలకు తుది ఫలితం వెలువడనుందని పేర్కొన్నారు.
ఈ నెల 11న జరిగిన పోలింగ్లో 4 లక్షల 13 వందల 65 మంది ఓటర్లకు గానూ, కేవలం 1,94,631 మంది మాత్రమే ఓటు వేశారు. వారిలో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. ఫలితాల వేళ ఆయా పార్టీలు, వారి అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సహకరించాలని ఆర్వీ కర్ణన్ కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram