తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీ లేదని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి వ్యాఖ్యానించారు
విధాత: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీ లేదని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి వ్యాఖ్యానించారు. సోనియాగాంధీకి ఆహ్వానంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా ఆమె స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాయకురాలిగా సోనియాగాంధీకి రాష్ట్ర అవతరణ వేడుకలకు వచ్చే అర్హత ఉందని స్పష్టం చేశారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని ప్రకటించి బీజేపీ మాట తప్పిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోక విడిచిపెట్టిన నాడు, యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటిని ఒప్పించి, కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగినా.. తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ చేసిన త్యాగంను తెలంగాణ ఉద్యమకారులు గౌరవించి తీరుతారని స్పష్టం చేశారు.
ఆ సోనియా గాంధీ రేపటి జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమానికి ఎట్లా హాజరవుతారని బీజేపీ నేత కిషన్ రెడ్డి అడిగితే, అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నాటి బీజేపీ ప్రమేయం ప్రత్యామ్నాయం లేక పార్లమెంటుల బిల్లుకు ఓటు వేసిన నాడు తప్ప అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో నాటి బీజేపీ ప్రమేయం ఎక్కడున్నదని, ప్రత్యామ్నాయం లేక పార్లమెంటు బిల్లుకు ఓటు వేసిన నాడు తప్ప అని కూడా తెలంగాణ సమాజం, ఉద్యమకారులు అడిగితీరుతారని కౌంటర్ వేశారు. కూడా తెలంగాణ సమాజం, ఉద్యమకారులు అడిగి తీరుతారని పేర్కొన్నారు. గౌరవనీయ కిషన్ రెడ్డి గారు.. సోనియాగాంధీ గారికి ఆ అర్హత సంపూర్ణంగా ఉందని, కానీ అడిగే అర్హత బీజేపీకి నిజానికి నిజాయితీగా ఐతే లేదన్నది కాదనలేని వాస్తవమని కిషన్రెడ్డి గ్రహించాలని విజయశాంతి తేల్చి చెప్పారు.