ఓ పొలంలో బంగారం దొరుకుతుందంటూ..భూమిని అమ్మిన, కొన్న వారు వాటాల కోసం పంచాయతీ పెట్టుకోవడంతో విషయం బహిర్గతమైంది. ఇందుకు సంబంధించిన వివాదం వైరల్ గా మారింది. వరంగల్ జిల్లా కోపాకులపాడులోని 6 ఎకరాల భూమిలో బంగారం బయటపడింది. ఈనెల 24న కలుపు తీస్తుండగా కూలీలకు దాదాపు 50 తులాల బంగారం దొరికింది. అయితే, తనకు వాటా ఇవ్వకుండా ప్రస్తుత యజమాని, కూలీలు ఆ బంగారాన్ని పంచుకున్నారని ఐదేళ్ల క్రితం ఆ భూమిని అమ్మిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఐదేళ్ల క్రితం చెన్నారావుపేటకి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన రైతు నుంచి ఈ భూమిని కొనుగోలు చేశాడు. ఈర్యతండాకు చెందిన రైతు దీన్ని కౌలుకు తీసుకొని ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. ఈ నెల 24న కలుపు తీయిస్తుండగా మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు ప్రచారం జరిగింది. దొరికిన బంగారం ఆభరణాలు అరకిలో ఉంటాయని సమాచారం. విషయం తెలుసుకున్న యజమాని కూలీలను పిలిచి విచారించగా దొరికిన బంగారు వస్తువులను చూపించారు. దీనిపై యజమాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతంలో పూర్వం ఆలయాలున్నాయని.. 1991లో అప్పటి భూ యజమానికి కూడా కొంత బంగారం దొరికిందని, తర్వాత కొన్నేళ్లకు పొలంలో జీతం ఉన్న వ్యక్తికి కూడా దొరికిందని గ్రామస్థులు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో దేవతామూర్తుల విగ్రహాలు లభించాయని తెలిపారు.
అయితే దొరికిన బంగారాన్ని పంచుకున్న వ్యక్తులపై చర్యలు తీసుకొని దాన్ని తమకు అందించి న్యాయం చేయాలని పదేళ్ల క్రితం భూమి విక్రయించిన వ్యక్తి కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అర్కియాలాజీ వాళ్లు బంగారం వివాదంపై విచారణ జరిపి మా వాటా మాకు ఇప్పించాలని కోరుతున్నారు. అయితే ఎప్పుడో భూమి అమ్మేసిన వ్యక్తికి ఇంకా ఆ పొలం మీద హక్కులు ఉంటాయా ? ఇలా బంగారం కాకుండా ఏ గ్రానైట్ లాంటిది ఉందని తెలిస్తే అందులోనూ వాటా ఇవ్వాలా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకసారి భూమి లేదా ప్రాపర్టీ అమ్మేశాక … మనకి దానిమీద ఎలాంటి హక్కులు ఉండవని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో ఉంటుంది. మరి అలాంటప్పుడు విక్రయించిన భూమిలో దొరికన సంపదకు పాత యజమానికి వాట అడిగే హక్కు ఉండదంటున్నారు. బంగారం పంపకాల వివాదం కొనసాగుతుండగానే…ఆ పొలంలో బంగారం దొరుకుతుందని తెలిసి చాలామంది రాత్రి పూట వచ్చి పొలంలో వెదుకులాటలు సాగిస్తూ…వేసిన పంటలు పాడు చేస్తుండటం ఇప్పుడు మరో సమస్య మారిపోయింది.
