ఆందోళన పడకండి అండగా ఉంటాం..జోర్డాన్‌లో చిక్కుకున్న కార్మికులకు హరీశ్ రావు ఫోన్

ఉపాధి కోసం తెలంగాణ నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్‌లో మాట్లాడారు. మీ ఇబ్బందులు మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు.

  • By: Tech |    telangana |    Published on : Oct 12, 2025 10:29 PM IST
ఆందోళన పడకండి అండగా ఉంటాం..జోర్డాన్‌లో చిక్కుకున్న కార్మికులకు హరీశ్ రావు ఫోన్

హైదరాబాద్, అక్టోబర్ 12 (విధాత): ఉపాధి కోసం తెలంగాణ నుంచి వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్‌లో మాట్లాడారు. మీ ఇబ్బందులు మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువచ్చే కృషి చేస్తున్నాం, అధైర్య పడవద్దని హరీశ్ రావు భరోసా ఇచ్చారు.

కాగా ఏడాది క్రితం 12 మంది తెలంగాణ వలస కార్మికులు ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్నారు. దేశం కాని దేశంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హరీశ్ రావుకు కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. ఎలాగైనా తమను తెలంగాణలో ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని విన్నవించారు. ఈ క్రమంలో హరీశ్ రావు ఫోన్ చేసి వారికి ధైర్యం చెప్పారు.