పనుల్లో నిమగ్నం కండి.. పార్లమెంట్ ఎన్నికల బాధ్యులకు దిశా నిర్దేశం

పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ ఆధ్వర్యంలో నియమించిన ఎన్నికల బాధ్యులందరూ తమకు కేటాయించిన పనుల్లో నిమగ్నం కావాలని బిజెపి కరీంనగర్

  • Publish Date - April 16, 2024 / 09:44 PM IST

బిజెపి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు.

విధాత బ్యూరో, కరీంనగర్: పార్లమెంటు ఎన్నికల కోసం పార్టీ ఆధ్వర్యంలో నియమించిన ఎన్నికల బాధ్యులందరూ తమకు కేటాయించిన పనుల్లో నిమగ్నం కావాలని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు అన్నారు. సోమవారం సాయంత్రం బిజెపి పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం జరిగింది. ఇట్టిసమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించడానికి తగిన కార్యాచరణతో ముందు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఇందుకోసం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మేనేజ్మెంట్ కమిటీ తగిన కృషి చేయాలన్నారు. ఎన్నికల నిర్వాహాణ కోసం ఏర్పాటుచేసిన కమిటీ లో ఉన్న ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను విధిగా చేపట్టాలన్నారు. ఇట్టి సమావేశంలో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ నిర్వాహణ బాధ్యులు, పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

Latest News