కృష్ణా వివాదాలపై విచారణ జులై 15, 16 తేదీలకు వాయిదా

కృష్ణా జలాల వివాదాలపై విచారణను జులై 15, 16 తేదీలకు వాయిదా వేస్తూ కృష్ణా ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)-2 నిర్ణయం తీసుకుంది. జులై 8 లోగా డ్రాఫ్ట్‌ ఇష్యూలపై నివేదికలను సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఆదేశించింది

  • Publish Date - May 16, 2024 / 06:20 PM IST

కౌంటర్‌ దాఖలుకు 4 వారాల గడువు

విధాత‌: కృష్ణా జలాల వివాదాలపై విచారణను జులై 15, 16 తేదీలకు వాయిదా వేస్తూ కృష్ణా ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)-2 నిర్ణయం తీసుకుంది. జులై 8 లోగా డ్రాఫ్ట్‌ ఇష్యూలపై నివేదికలను సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఆదేశించింది. దిల్లీలో ట్రిబ్యున‌ల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌కుమార్‌, సభ్యులు జస్టిస్‌ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్‌ తాళపత్ర సమక్షంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.కౌంటర్‌ దాఖలుకు 4 వారాల సమయం కావాలని ఏపీ, 2 వారాల సమయం కావాలని తెలంగాణ కోరాయి. రెండు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత కౌంటర్‌ దాఖలుకు ట్రైబ్యునల్‌ 4 వారాల సమయమిచ్చింది.

Latest News