తెలంగాణలో రాగల 3రోజుల పాటు తేలికపాటి వర్షాలు

విధాత,హైదరాబాద్‌ : తెలంగాణలో రాగల 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందని తెలిపింది. ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి తదుపరి 48 […]

  • Publish Date - September 10, 2021 / 11:19 AM IST

విధాత,హైదరాబాద్‌ : తెలంగాణలో రాగల 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైందని తెలిపింది.

ఈ ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి తదుపరి 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి వీస్తున్నాయని తెలిపింది.